కొడంగల్, సెప్టెంబర్ 28 : అధిక వర్గాల మూలంగా పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లిందని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ప్రవీణ్కుమార్ తెలిపారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏరువాక కేంద్రం తాండూరు ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్, ఐనాన్పల్లి గ్రామంలో పత్తి, వరి పంటలను పరిశీలించారు. గ్రామంలో రైతులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చీడపీడ పురుగుల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తిలో తామర పురుగు, ఆకుమచ్చ తెగులును గుర్తించినట్లు తెలిపారు.
వీటి నివారణకు గాను పిప్రోనిల్ 2 ఎంఎల్ లేదా ప్టోనిక్ ఆమైడ్ 0.3 గ్రాములు పిచికారీ చేయాలని సూచించారు. అలాగే ఆకుమచ్చ తెగులు నివారణకు గాను 1గ్రాము కార్పెండిజం పొడిని లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. వరి పంటలో కాండం తొలుచు పురుగు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని దీని నివారణకు లేదా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కోరాజన్ 0.3ఎంఎల్ పిచికారీ చేయాలని సూచించారు. అదేవిధంగా పంట రక్షణల పట్ల రైతులకు సూచనలు సలహాలను అందించారు. కార్యక్రమంలో ఏడీఏ శంకర్రాథోడ్, బీటీఎం బాలకృష్ణ, ఏఈవో రాజురాథోడ్, దేవేందర్నాయక్తో పాటు రైతులు పాల్గొన్నారు.