పరిగి, సెప్టెంబర్ 25 : రాష్ట్ర అర్థ గణాంక శాఖ ఆధ్వర్యంలో జాతీయ సామాజిక, ఆర్థిక సర్వే ప్రారంభమైంది. ప్రజల జీవన స్థితిగతులు, వారికి అందుతున్న సేవలు తదితర అం శాలపై అర్థగణాంక శాఖ ద్వారా సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే, ఆయూష్ సంబంధిత సర్వేను అధికారులు ప్రారంభించారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలో ఎంపిక చేసిన ఎనిమిది గ్రామాలు, మున్సిపాలిటీలలోని ఎనిమిది వార్డుల్లో సర్వే చేయ నున్నారు.
అర్థగణాంక శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఏ త్రైమాసికంలో ఏ గ్రా మంలో ఏ సర్వే చేయాలనే అంశాలపై సూచనలకు అనుగుణంగా ఈ సర్వే జరుపుతారు. ఇందులో భాగంగా జిల్లాలోని పూడూరు మండలం తిర్మలాపూర్ గ్రామంలో శనివారం సర్వే ప్రారంభమైంది. మండల ప్రణాళిక, గణాంకాధికారులు ఈ సర్వే చేపడుతున్నారు. సర్వేను జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సి.నిరంజన్రావు పర్యవేక్షించారు. సర్వేలో భాగంగా కొన్ని అభివృద్ది సూచికల మేరకు సమాచారం సేకరిస్తున్నారు.
జిల్లా పరిధిలో ఎంపిక చేసిన ఎనిమిది గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలోని ఎనిమిది వార్డుల్లో సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని మో మిన్పేట్ మండలం టేకులపల్లి, తాండూరు మండలం శంకర్రెడ్డిపల్లి, బంట్వారం మం డలం కొత్తపల్లి, పెద్దేముల్ మండలం కందనెల్లి, పూడూరు మండలం తిర్మలాపూర్, బషీరాబాద్ మండలం పర్వత్పల్లి, యాలాల్ మండలం పర్కంపల్లి, నవాబుపేట్ మం డలం పులుమామిడి గ్రామాలు, తాండూరులోని 1, 6, 9, 18 బ్లాకులు, వికారా బాద్ లోని 7, 8వ బ్లాకులు, నవాంద్గిలోని 6వ బ్లాకులో ఈ సర్వే చేపడుతారు.
ఎంపిక చేసిన గ్రామాలలో 800 నుంచి 1200 మందిని సర్వే చేయడం జరుగుతుంది. సంబంధిత గ్రామంలో సరిపోను జనాభా లేకపోతే అనుబంధ గ్రామాలలో సర్వే చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన బ్లాకులలో సర్వేకు అవసరమైన వారి కంటే ఎక్కువ మంది ఉంటే సబ్ బ్లాకులు చేసి సర్వే నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజల జీవన స్థితిగతులు, వారికి అందుతున్న సేవలపై సర్వే చేస్తారు. ఈ సర్వేలో భాగంగా పారిశుధ్యం, శుద్ధి చేసిన తాగునీరు, సాంకేతిక పరిజ్ఞానం ఎలా అందుబాటులో ఉన్నది, విద్యావకాశాలు ఎలా ఉన్నాయి, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఉపయోగించు కున్నారా, ప్రధానంగా ఆయుష్కు సంబంధించిన అంశం తెలుసా, తెలిస్తే హోమియోపతి, ఇతర వైద్యం ఉపయోగించుకున్నారా, యోగా చేస్తున్నారా తదితర అన్ని అంశాలపై సమ గ్రమైన సర్వేను చేయనున్నారు.
ఇందులో భాగంగా సదరు వ్యక్తులు ఏ అంశాలపై ఎంత ఖర్చు చేస్తున్నారు తదితర విషయాలు సైతం సర్వే చేస్తారు. దీంతో గ్రామాలు, పట్టణా ల్లో నివసించే ప్రజల జీవన స్థితిగతులన్నీ ఈ సర్వే ద్వారా వెల్లడవుతుంది. ఇందులో ప్రధానమైంది సర్వేలో తెలుసుకున్న అంశాలను తప్పనిసరిగా గోప్యంగా ఉంచుతారు. ఎంపిక చేసిన గ్రామంలో సంబంధిత మండల ప్రణాళిక, గణాంక అధికారితోపాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన అధికారులు పాల్గొంటారు. పూర్తిస్థాయిలో సమా చారం సేకరించడం ద్వారా ప్రజల జీవన స్థితిగతులు పూర్తిస్థాయిలో తెలుస్తాయి.