నివాస గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో లేక దూర ప్రాంతాలకు వెళ్తున్న పేద విద్యార్థులకు రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు మాన్పించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో నిరుపేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.600 చొప్పున పది నెలలకు రవాణా భత్యం అందించాలని నిర్ణయించింది.
విద్యార్థి ఇంటికి ప్రాథమిక పాఠశాల కిలోమీటరు దూరం, ప్రాథమికోన్నత పాఠశాల 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాల 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే రవాణా భత్యం వర్తింపజేస్తున్నది. ఈ మేరకు వికారాబాద్ జిల్లాలో 824 మంది, రంగారెడ్డి జిల్లాలో 231 మంది విద్యార్థులు అర్హులున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఏడాదికి సంబంధించిన రవాణా భత్యం నగదును ప్రభుత్వం ఏటా ఫ్రిబవరి నెలలో నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది. దీనికోసం అధికారులు విద్యార్థులతో ప్రత్యేకంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు.
పరిగి, ఆగస్టు 19: సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలతోపాటు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. మరోవైపు మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలలకు రోజు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి రవాణా ఖర్చుల నిమిత్తం నెలకు రూ.600 చొప్పున భత్యం ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలు స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తారు. ప్రాథమికోన్నత విద్య, హైస్కూల్ విద్య కు పొరుగు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఇది ఆర్థిక భారం. పిల్లలు ఆటోలు, వ్యాన్లలో బడికి వెళ్లాల్సిన పరిస్థితి.
దీంతో వారి తల్లిదండ్రులు పిల్లల చదువు మాన్పిస్తున్నారు. దీంతో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. డ్రాపౌట్స్పై దృష్టి సారించిన సర్కార్ వారికి విద్యను చేరువ చేయాలని మూడేళ్ల క్రితం సంకల్పించింది. అయితే కొవిడ్ వైరస్ నేపథ్యంలో నిలిచిపోయింది. ఈ ఏడాది నుంచి దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ బడులకొచ్చే విద్యార్థులకు రవాణా భత్యాన్ని చెల్లించాలని సర్కారు నిర్ణయించింది.
ప్రతి మండలం నుంచి ఎంతమం ది విద్యార్థులు తమ సమీపంలో పాఠశాల లేకపోవడంతో ఇతర గ్రామాల్లోని బడులకు వెళ్తున్నారనే వివరాలను సేకరించి..వారందరికీ రవా ణా భత్యాన్ని అందించనున్నారు. వికారాబాద్ జిల్లాలో 824 మంది విద్యార్థులకు రవాణా భ త్యాన్ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వికారాబాద్ జిల్లాలోని 109 ఆవాసాలకు చెం దిన 824 మంది విద్యార్థులు రవాణా భత్యానికి అర్హులుగా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 507 మంది విద్యార్థులు, ఉన్నత పాఠశాలలకు చెందిన 317 మంది విద్యార్థులున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెంది న విద్యార్థులు తమ ఊరు నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి మూడు కిలోమీటర్లకు పైగా దూరం వెళ్తే.. అదేవిధంగా ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఐదు కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లి చదువుకునే వారికి ప్రభుత్వం రవాణా భత్యాన్ని చెల్లించనున్నది. అధికారులు ఆయా మండలాలు, పాఠశాలల వారీగా జాబితాను రూపొందించి, విద్యార్థులకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను తెరిపించనున్నారు.
రవాణా భత్యం పొందేందుకు ఎంపికైన విద్యార్థులకు ఈ ఏడాది నుంచి వారి బ్యాంకు ఖాతా ల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేలా ప్రత్యేకం గా ఖాతాలను తెరిపిస్తున్నారు. గతంలో సంబంధిత పాఠశాలలకు చెందిన ఎస్ఎంసీ ఖాతాల్లో విద్యార్థుల రవాణా భత్యం డబ్బులు జమ అయ్యేవి. వాటిని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డ్రా చేసి విద్యార్థులకు అందించేవారు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలను విద్యార్థుల పేరుతో ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయనున్నారు. సద రు విద్యార్థులకు రవాణా భత్యం కింద ప్రతి నెలా రూ.600 చొప్పున వారి ఖాతాల్లో జమ కానున్నది. తద్వారా ఎలాంటి జాప్యం లేకుం డా విద్యార్థులకు డబ్బులు అందుతాయి.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. గ్రామాలకు చెందిన విద్యార్థులకు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు అందుబాటులో లేక పొరుగు గ్రామాలకు వెళ్లాల్సి రావడం భారంగా మార డంతో కొందరు విద్యార్థులు ఆటోలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి పాఠశాలలకు వెళ్తుండగా.. మరికొందరు మధ్యలోనే చదువును మానేస్తున్నారు. దీంతో డ్రాపౌట్స్ శాతం పెరుగుతున్నది. దానిని అరికట్టేందుకు ప్రభుత్వం దూర ప్రాంతాలకెళ్లి చదువుకునే ప్రతి విద్యార్థికీ రూ. 600 చొప్పున రవాణా భత్యాన్ని చెల్లించాలని నిర్ణయించింది. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థుల ఇంటి నుం చి ప్రాథమిక పాఠశాల కిలోమీటరు దూరం, ప్రాథమికోన్నత పాఠశాల మూడు కిలోమీట ర్లు, ఉన్నత పాఠశాల ఐదు కిలోమీటర్ల దూ రంలో ఉంటే రవాణా భత్యాన్ని అధికారులు వర్తింపజేస్తారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వం చేయూత అందిస్తున్నది. బడుల్లో డ్రాపౌట్స్ శాతాన్ని తగ్గించేందుకు పొరుగు గ్రామాలకెళ్లి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం రవాణా భత్యాన్ని చెల్లించడం ద్వారా పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఏడాదికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది. సర్కార్ తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పొరుగు గ్రామాల్లోని పాఠశాలలకెళ్లి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉండటం సంతోషకరం. నేను షాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్నా. మా గ్రామం నుంచి పాఠశాలకు వెళ్లాలంటే ఎనిమిది కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. ప్రతిరోజూ ఆటో, బస్సుల్లో స్కూల్కు వెళ్తున్నా. ప్రభుత్వం ప్రతినెలా రూ.600 చొప్పున రవాణా భత్యాన్ని చెల్లించేందుకు చర్యలు చేపట్టడం చాలా ఆనందంగా ఉంది.
-మైత్రి, తొమ్మిదో తరగతి విద్యార్థిని, బొబ్బిలిగామ
పొరుగు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకెళ్లి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.600 చొప్పున రవాణా భత్యాన్ని చెల్లిస్తుంది. జిల్లాలో 231 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించడం జరిగింది. వారికి ప్రతినెలా రూ. 600 చొప్పున ఏడాదికి కలిపి మొత్తం ఒకేసారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నాం. రవాణా భత్యం చెల్లించ డం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గడంతోపాటు విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
– సుశీందర్రావు, రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ అధికారి
జిల్లాలో 109 ఆవాసాలకు చెందిన 824 మంది విద్యార్థులు రవాణా భత్యానికి అర్హులుగా గుర్తించడం జరిగింది. ఆ విద్యార్థుల పేరుతో బ్యాంకు, పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిపించడంతోపాటు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయడం జరుగుతుంది. పక్క గ్రామాలకెళ్లి చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు ప్రతినెలా రూ.600 చొప్పున రవాణా భత్యం అందనున్నది.
-రేణుకాదేవి, వికారాబాద్ డీఈవో