ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహస్రచండీయాగాన్ని వైభవంగా సాగుతున్నది. శుక్రవారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 19 : మండలంలోని ఎలిమినేడు గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సహస్రచండీయాగం రెండోరోజు వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హాజరై పూజలు చేశారు. అదే విధంగా రాష్ట్ర మార్కెటింగ్శాఖ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. సాయంత్రం ఎమ్మెల్యే మంచిరెడ్డి దంపతులు, ఆయన కుమారుడు రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో లక్ష్మీనర్సింహస్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
పలువురు బ్రాహ్మణులతో వేదమంత్రోచ్ఛారణ మధ్య అంగరంగవైభవంగా కల్యాణాన్ని నిర్వహించారు. రెండోరోజు శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని చండీమాత దర్శనం చేసుకున్నారు. అనంతరం హోమం కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అన్నదాన కార్యక్రమాన్ని మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సహస్రచండీయాగంలో భాగంగా మూడోరోజు శనివారం హోమం అనంతరం పద్మావతి శ్రీనివాస కల్యాణాన్ని నిర్వహించనున్నారు.
ఈ యాగంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమనారెడ్డి, మంచాల ఎంపీపీ నర్మద, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, పెద్దఅంబర్పేట్ మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్న, పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, రమేశ్, రమేశ్గౌడ్, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్చైర్మన్ యాదగిరి, తాసీల్దార్లు రామ్మోహన్రావు, సుచరిత, అనిత, దేవుజా, మున్సిపల్ కమిషనర్లు, యూసఫ్, అమరేందర్, ఎంపీడీవోలు శ్రీనివాస్, విజయలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు మహేశ్గౌడ్, సురేశ్, జెర్కోని రాజు, యాచారం రవీందర్, ముత్యాల నరేశ్, మంద సురేశ్, సుధాకర్, జగన్, మల్లేశ్, జగదీశ్, కౌన్సిలర్లు పద్మ, మంగ, మమత, సుజాత, జ్యోతి పాల్గొన్నారు.