షాబాద్, జూన్ 30: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. షాబాద్ మోడల్ స్కూల్ విద్యార్థులు మండల టాపర్లుగా నిలిచారు. అదే విధంగా జిల్లాలోని 9 మోడల్ స్కూల్స్కు గాను షాబాద్ మోడల్ స్కూల్ ప్రథమ స్థానంలో నిలిచింది. షాబాద్ మండలంలో మొత్తం 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 484 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 385 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో తెలిపారు. షాబాద్ మోడల్ స్కూల్ విద్యార్థులు సాయివర్ధ్దన్, స్వాతి, కార్తీక్ 10 జీపీఏ సాధించి మండల టాపర్లుగా నిలిచారు.
షాద్నగర్టౌన్ : పది ఫలితాల్లో ఫరూఖ్నగర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని ఎంఈవో శంకర్రాథోడ్ గురువారం తెలిపారు. మండలంలోని బూర్గుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని జ్యోత్స్న 10 జీపీఏ, చించోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సౌమ్య 9.8, మధురాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత విద్యార్థిని రాధిక 9.7, మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పల్లవి 9.7, షాద్నగర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి శివశంకర్ 9.7, షాద్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి నరేశ్ 9.7, రాయికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అకిల్ 9.5, షాద్నగర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని అక్షిత 9.5 జీపీఏ సాధించారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని చటాన్పల్లి వివేకానంద కళాశాలలో కొనసాగుతున్న కేశంపేట మండలానికి సంబంధించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి అజయ్ పది ఫలితాల్లో 10జీపీఏ సాధించినట్లు ప్రిన్సిపాల్ సుభాన్ఖాన్ తెలిపారు. గురుకుల పాఠశాలలో 96.2శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు.
మంచాల : పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మండలంలో 398 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. అందులో 368 మంది ఉత్తీర్ణులయ్యారు. మండలంలోని ఆరుట్ల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన అంతోజి అవంతిక, తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన ప్రత్యూష 10 గ్రేడ్ సాధించి టాపర్గా నిలిచారు. ఆరుట్ల మోడల్ స్కూలుకు చెందిన లక్ష్మీ ప్రసన్న 9.8 సాధించింది. మండలంలో 93 శాతం ఉత్తీర్ణత సాధించారు.
యాచారం : నందివనపర్తి 100శాతం, చింతపట్ల100శాతం, యాచారం 96.25శాతం, చిన్నతుండ్ల 94.44, శాతం, నల్లవెల్లి 91.30శాతం, కుర్మిద్ద 91.18శాతం, మేడిపల్లి నక్కర్త 88.89శాతం, గున్గల్ 87.50శాతం, మాల్ 85.51శాతం, కొత్తపల్లి 81.48శాతం, గున్గల్ ఆదర్శ పాఠశాల 95.70 శాతం, యాచారం కస్తూర్బా గాంధీ పాఠశాల 95.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. యాచారం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఇందు 9.8, మేడిపల్లి జిల్లాపరిషత్ పాఠశాలకు చెందిన సందీప్రెడ్డి 9.8, నవ్య 9.5, గున్గల్ ఆదర్శ పాఠశాలకు చెందిన ఎండీ.అతీఫ్ అబ్ర్ 9.7, పూజిత 9.7, మనీష 9.5, శ్రీనిధి 9.5, ప్రవీణ్ 9.5, పూజ 9.5, పద్మావతి 9.5, నందివనపర్తికి జడ్పీహెచ్ఎస్కు చెందిన రుద్రాకర్ చారి 9.5, జడ్పీహెచ్ఎస్ చిన్నతుండ్ల కీర్తన 9.5, కొత్తపల్లికి చెందిన స్పందన 9.5 గ్రేడ్ మార్కులతో సత్తా చాటారు.
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీతోపాటు తారామతిపేట, కుత్బుల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభచాటారు. పెద్దఅంబర్పేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 87 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 67 మంది పరీక్ష రాయగా.. 58 మంది పాసయ్యారు. విద్యార్థిని జెనీలియా 9.7 గ్రేడ్తో ప్రథమస్థానంలో నిలిచింది. తట్టిఅన్నారం ఉన్నత పాఠశాలలో 15 మంది విద్యార్థులకు గాను 11 మంది పాసయ్యారు. తారామతిపేట ఉన్నత పాఠశాలలో 78 శాతం, కుత్బుల్లాపూర్లో 73 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
కడ్తాల్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 95 మంది విద్యార్థులకు 93 మంది పాసయ్యారు. ఎన్.మణికుమార్ 9.8 గ్రేడ్, గణేశ్ 9.8 గ్రేడ్ సాధించారు. బాలికల ఉన్నత పాఠశాలలో 70 మంది విద్యార్థినులకు 70 మంది ఉత్తీర్ణులవ్వగా, శ్రేయ 9.8 గ్రేడ్ సాధించారు. ముద్విన్ పాఠశాలలో 46 మందికి 45 మంది, ఏక్వాయిపల్లి ప్రభుత్వ పాఠశాలలో 24 మందికి 24 మంది, రావిచేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 54 మందికి 48 మంది, చరికొండ ప్రభుత్వ పాఠశాలలో 27 మందికి 26 మంది విద్యార్థులు పాసయ్యారని, అఖిల 10 గ్రేడ్ సాధించిందని హెచ్ఎం తిరుపతయ్య తెలిపారు. మైసిగండిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 39 మందికి 38 మంది పాసయ్యారు. పవన్నాయక్ 10 గ్రేడ్ సాధించారు. కేజీబీవీ పాఠశాల 33 మంది 33 మంది పాసయ్యారు. అనుషా 10 గ్రేడ్ సాధించిందని ప్రిన్సిపాల్ అనిత తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలలో 97.16 శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో తెలిపారు.
కేశంపేట : పాటిగడ్డ పరిధిలోని మేరి ఇమాక్యులేట్ ఉన్న త పాఠశాలకు చెందిన విద్యార్థులు పృథ్వీతేజ్, పసుల జగదీశ్యాదవ్ 10/10 మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. కేశంపేట ఉన్నత పాఠశాలకు చెందిన మైత్రి, శ్రుతి, రుక్సార్, దీపక్, శ్రేయ, కస్తూర్బా పాఠశాలకు చెందిన ఎన్.అశ్విత 9.8 శాతం మార్కులు సాధించారు. కేశంపేట ఉన్నత పాఠశాలలో 94 మంది పరీక్ష రాయగా 94 మంది ఉత్తీర్ణులై 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇబ్రహీంపట్నం, జూన్ 30 : ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 713మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 620మంది ఉత్తీర్ణులయ్యారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. నల్లకంచ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 81మందికి 81మంది ఉత్తీర్ణులయ్యారు. ఇబ్రహీంపట్నం బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో 76 మంది పరీక్షలు రాయగా 75 మంది, బొంగ్లూరు ఆదర్శ పాఠశాలలో 50మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 43 మంది, శేరిగూడ ప్రభుత్వ పాఠశాలలో 49మందికి 45మంది ఉత్తీర్ణత సాధించారు. ఇద్దరు 10/10మార్కులు సాధించారు.
అబ్దుల్లాపూర్మెట్ : మజీద్పూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. మండల వ్యాప్తంగా 86 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మండలంలో రాగన్నగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కె శ్రాణి 10/10 సాధించింది.