సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 300 కొత్త బస్సులను కొనుగోలు చేయబోతున్నది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు రం గం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా కంపెనీలకు కొటేషన్లను పంపారు. ఒక్కొక్క బస్సును గతం లో రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే, కొత్తగా కొనుగోలు చేయబోయే ఎలక్ట్రిక్ బస్సు ఖరీదు రూ.1.60 కోట్లకు మాత్రమే మార్కెట్లో లభించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ బస్సులను నగరం లో అన్ని ప్రధాన మార్గాల్లో నడిపించేందుకు ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు చర్యలు తీసు కుంటున్నారు. అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన తర్వాతే కొత్తగా 300 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రే టర్ పరిధిలో ఎయిర్పోర్టు మార్గాల్లో 40 ఎలక్ట్రి క్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వచ్చే ఒకటి లేదా రెండు రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగనున్నాయి. అయితే, అందుకోసం సంబంధిత డిపోల పరిధిలో ఛార్జింగ్ పాయింట్లనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నగరంలో 400 సిటీ బస్సులకు కాలం చెల్లినట్లుగా ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. 2009 తర్వాత ఇంతవరకు ఒక్క బస్సును కూడా కొనుగోలు చేయలేదు. దీంతో 400 బస్సులు కొనుగోలు చేసి 15 ఏండ్లు పూర్తి కావొస్తున్నది. దీంతో ఆయా బస్సులను స్క్రాప్ కింద తీసేస్తారు. వాటి స్థానంలో జిల్లా నుంచి బస్సులను సిటీ పరిధిలోకి తరలిస్తారు. ఆ బస్సులను తిరిగి సిటీ బస్సులుగా మారుస్తారు. అయితే, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో మొత్తం 1016 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త బస్సులు వచ్చిన నేపథ్యంలో వా టిలో 400 బస్సులను తిరిగి సిటీ బస్సులుగా మార్చనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.