బషీరాబాద్, సెప్టెంబర్ 25 : మండలంలోని వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతున్నది. గొట్టిగఖుర్దు, గొట్టిగకలాన్, మైల్వార్, ఎక్మాయి గ్రామాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ను శనివారం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప తాసిల్దార్ వీరేశ్బాబు మాట్లాడుతూ గ్రామాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ను నిర్వహిస్తుండడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు గ్రామాల్లో వ్యాక్సిన్పై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన వెంట ఆయా గ్రామాల సర్పంచ్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.
మండలంలో 998మందికి వ్యాక్సిన్
ధారూరు, సెప్టెంబర్ 25 : మండల పరిధిలోని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వ్యాక్సినేషన్ సెంటర్లలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ధారూరు పీహెచ్సీ పరిధిలో మొత్తం 462మంది, నాగసముందర్ పరిధిలో 536మందికి వ్యాక్సిన్ వేశామని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు రాజు, రమేష్బాబు తెలిపారు.
బొంరాస్పేట..
బొంరాస్పేట, సెప్టెంబరు 25 : మండలంలో కొవిడ్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతున్నది. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి టీకా తీసుకోని వారిని గుర్తించి శనివారం మండలంలోని పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది 510 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు పది వేల మందికి కొవిడ్ టీకా వేసినట్లు హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కరాచారి తెలిపారు.
అల్లాపూర్లో
తాండూరు రూరల్, సెప్టెంబరు 25 : తాండూరు మండలంలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతున్నది. జినుగుర్తి పీహెచ్సీ పరిధిలోని 9 సబ్సెంటర్లలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఆయా ఉప కేంద్రాల్లో గ్రామస్తులకు కొవిడ్ టీకా వేస్తున్నారు. శనివారం మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగింది.
యాలాల మండల పరిధిలో
యాలాల, సెప్టెంబర్ 25 : యాలాల మండల పరిధిలో జుంటుపల్లి, హజీపూర్, యాలాల, బెన్నూర్, కమాల్పుర పగిడియాల్, అగ్గనూర్ సబ్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. సబ్ సెంటర్లలో 669 మందికి కొవిడ్ టీకా వేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మండల వైద్యాధికారి అశ్విని సూచించారు. ఆమె వెంట సూపర్వైజర్లు సుచిత్ర, శోభారాణి, అరుణ, ఏఎన్ఎమ్లు, ఆశా వర్కర్లు ఉన్నారు.