ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23 : బండరావిరాల మైనింగ్జోన్ రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో బాధిత రైతులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బండరావిరాలలో రైతుల నుంచి మైనింగ్జోన్కు భూసేకరణ జరిగింది. అప్పట్లో రైతులకు పరిహారం ఇప్పించలేని కాంగ్రెస్పార్టీ నాయకులు రాజకీయ లబ్ధికోసమే రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. కొవిడ్ నేపథ్యంలో పరిహారం ఆలస్యమైందన్నారు. కొందరు నాయకులు క్రషర్ యజమానులను బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. ఏండ్ల తరబడి రైతులకు డబ్బులిప్పించలేని మల్రెడ్డి రంగారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో బండరావిరాల రైతులు, బాధిత రైతులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పేదల వైద్యానికి ప్రభుత్వం అండ
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23 : పేదల వైద్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని యాచారం మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన రమావత్ మోతీరాంకు సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.4లక్షలు, రాయపోల్ గ్రామానికి చెందిన ఎల్లంకి విజయ్కి రూ.43వేల మంజూరయ్యాయి. గురువారం క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేసి మాట్లాడారు. అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల బాధితలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, ఎంపీపీ కృపేశ్, సర్పంచ్లు బల్వంత్రెడ్డి, జగదీశ్, జయలక్ష్మి, కిషన్నాయక్, మండలాధ్యక్షుడు బుగ్గరాములు, మండల ప్రధాన కార్యదర్శులు పాశ్చబాష, భాస్కర్రెడ్డి, నాయకులు కిషన్రెడ్డి, జంగయ్య, కొండల్ పాల్గొన్నారు.