ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్
షాద్నగర్, సెప్టెంబర్ 22 : మత్స్యకారుల జీవితాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులు నింపిందని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులకు కనీస గుర్తింపు ఉండేది కాదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలను గుర్తించి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను అభివృద్ధి చేసి మత్స్యకారులకు ఉపాధి చూపారన్నారు. రెండు, మూడేండ్లుగా చెరువులు నిండడంతో చేపల సాగు గణనీయంగా పెరిగిందన్నారు. చెరువులు, రిజర్వాయర్లలో పెద్దఎత్తున చేపల పెంపకం చేపట్టడం సంతోషకరమని చెప్పారు. ఇందులో భాగంగా కంసాన్పల్లి, లింగారెడ్డిగూడ గ్రామాల మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, ఎంపీడీవో శరత్చంద్రబాబు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, కౌన్సిలర్ ప్రతాప్రెడ్డి, మత్స్యకారులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు కొండంత అండ
షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 22 : సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం బూర్గుల, రాసుమల్లగూడ గ్రామాలకు చెందిన హేమంత్కుమార్, రాజు, బాలయ్యకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిరుపేదల ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, కౌన్సిలర్ ప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నాయకులు రంగయ్య, హరికృష్ణ, శివ, సంతోష్ పాల్గొన్నారు.