మర్పల్లి, సెప్టెంబర్ 15: రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం చెరువు మల్లేశం ఆధ్వర్యంలో నూతన మార్కెట్ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలం గాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్కెట్ విధానాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదన్నారు. రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించిందన్నారు. రైతు వేదికలు వినియోగించుకుంటున్నారా అంటూ మండల వ్యవసాయాధికారి వసంతను అడిగి తెలుసుకున్నారు. కొత్త పంటలు, లాభాలు వచ్చే పంటలు పండించాలని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. బస్టాండ్ ఆవరణలో ప్రతి వారం జరిగే సంతవల్ల బస్సులు లోప లికి వెళ్లడం లేదని ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా మార్కెట్ యార్డులో షెడ్డు నిర్మించి కూరగాయాల మార్కెట్ను తరలించాలని సూచించారు. పత్తి రైతులకు అందుబాటులో ఉండేందుకు మోమిన్ పేట్లో పత్తి జిన్నింగ్ మిల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ సభ్యు లను, గ్రామాలలో నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులను సన్మా నించారు. కార్యక్రమంలో ఎంపీపీ లలిత రమేశ్, జడ్పీటీసీ మధుకర్, ఎంపీ టీసీ సంగీత, వైస్ చైర్మన్ లక్ష్మయ్య, డైరెక్టర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, సీనియర్ నాయకులు ప్రభాకర్గుప్తా, రామేశ్వర్, అశోక్, మధు కర్ వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిక
మండలంలోని రావులపల్లి గ్రామానికి చెందిన వ్యాపారవేత్త చంద్రశేఖర్రెడ్డి మరో 10 మంది కాంగ్రెస్ నాయకులు బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మర్పల్లి మండల కేంద్రంలో మార్కెట్ కార్యాలయ నూతన భవన ప్రారం భోత్సవానికి వచ్చిన చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సమక్షంలో చంద్రశేఖర్రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.