నందిగామ, సెప్టెంబర్ 15 : గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్ అన్నారు. బుధవారం టీఆర్ఎస్ నందిగామ మండలాధ్యక్షుడు పద్మారెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ఎన్నికల పరిశీలకులు యాదగిరి, రాజవరప్రసాద్, జంగయ్య, నవీన్ పర్యవేక్షణలో టీఆర్ఎస్ పార్టీ నందిగామ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బంటారం లింగంగౌడ్, ఉపాధ్యక్షుడిగా ఆశీర్వాదం, కార్యదర్శిగా అంజయ్య, బీసీ సెల్ అధ్యక్షుడిగా గడ్డల శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా రాజశేఖర్, కార్యదర్శిగా మురళి, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎపూరి శ్రీనివాస్, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా పాత్లవత్ బద్రునాయక్, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుని కర్యవర్గ సభ్యులకు నియామకత్రం అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 15 : మున్సిపాలిటీలోని 28వ వార్డులో టీఆర్ఎస్ వార్డు కమిటీని మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్తో కలిసి ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ వార్డు కమిటీ అధ్యక్షుడిగా ప్రదీప్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, నర్సింహ, సత్యం, కార్యదర్శిగా రవి, సంయుక్త కార్యదర్శిగా శేఖర్, కోశాధికారిగా నవీన్, కార్యవర్గ సభ్యులుగా యాదయ్య, జ్ఞానేశ్, మదన్, వినయ్, బాబు, ప్రవీణ్, యూత్ అధ్యక్షుడిగా అభిలాశ్, ఉపాధ్యక్షుడిగా శ్రీకాంత్, కార్యదర్శిగా రవితేజ, సంయుక్త కార్యదర్శిగా శివ, కోశాధికారిగా రాహుల్, ప్రచార కార్యదర్శిగా సందీప్, కార్యవర్గ సభ్యులుగా సాయి, రోహిత్, రేవంత్, పవన్, చైతన్య, చరణ్, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా చంద్రకళ, ఉపాధ్యక్షురాలిగా మంజూల, కార్యదర్శిగా హైమావతి, సంయుక్త కార్యదర్శిగా సరిత, కోశాధికారిగా వసంత, ప్రచార కార్యదర్శిగా రేఖ, కార్యవర్గ సభ్యులుగా శారద, రేణుక, సువర్ణను ఎన్నుకుని నియామక పత్రాన్ని అందజేశారు.
పార్టీ పటిష్టతకు సైనికుల్లా పనిచేయాలి
చేవెళ్ల టౌన్, సెప్టెంబర్ 15 : పార్టీ పటిష్టతకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి తెలిపారు. మండల పరిధిలోని రామన్నగూడలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు వేశారు. రామన్నగూడ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పెద్దోళ్ల నర్సింహులు, ప్రధాన కార్యదర్శిగా తుప్పరి గోపాల్ రెడ్డి, యూత్ అధ్యక్షుడిగా తుప్పరి సంజీవ రెడ్డిని ఎన్నుకున్నారు.
గ్రామ కమిటీలు ఏకగ్రీవం
కొందుర్గు, సెప్టెంబర్ 15 : మండలంలోని ముట్పూర్, ఆగిర్యాల, శ్రీరంగాపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, రామకృష్ణ, సాదిక్ పాల్గొన్నారు.
చిన్నమంగళారం అధ్యక్షుడిగా నడిమిట్ట రాములు
మొయినాబాద్, సెప్టెంబర్ 15 : మండల పరిధిలోని చిన్నమంగళారం టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నడిమిట్ట రాములను నియమించారు. సర్పంచ్ సుకన్య, ఎంపీటీసీ మల్లేశ్, టీఆర్ఎస్ నాయకులు హరిశంకర్గౌడ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఉపాధ్యక్షులుగా సయ్యద్ గౌస్, మంగళి ప్రభు, ప్రధాన కార్యదర్శిగా జి నర్సింహగౌడ్, కార్యదర్శులుగా ఎం నర్సింహులు, సీహెచ్ వేణు, కార్యవర్గ సభ్యులుగా టీ రాములు, మహేందర్, వడ్డె రాములు, బేగరి శేఖర్ను నియమించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ శంకరయ్య, మాజీ ఎంపీటీసీ యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు పద్మారావు, బి శంకర్, ఎండీ డేవిడ్, విష్ణుగౌడ్, వెంకటేశ్, జహంగీర్, ఉపసర్పంచ్ బేగరి గోపాల్ పాల్గొన్నారు.
గడపగడపకూ పథకాలు వివరించాలి
షాద్నగర్రూరల్, సెప్టెంబర్ 15 : పథకాలను గడపగడపకూ వివరించాలని కిషన్నగర్ సర్పంచ్ శ్రీశైలంయాదవ్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ నారాయణరెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఫరూఖ్నగర్ మండలంలోని కిషన్నగర్ గ్రామ, యూత్, బీసీ, ఎస్సీ, మైనార్టీ కమిటీ అధ్యక్షులుగా బుచ్చిలింగగౌడ్, కంతల రాజు, లింగంయాదవ్, విఠ్యాల రవి, నవాబ్ ప్రధాన కార్యదర్శులుగా ఆంజనేయులు, మధుగౌడ్, శ్రీనివాస్గౌడ్, లింగం, దస్తగిరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారికి నియామక పత్రాలను అందజేశారు.
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం
షాద్నగర్, సెప్టెంబర్15 : మున్సిపాలిటీలో 13, 20, 23, 28 వార్డుల నూతన టీఆర్ఎస్ కమిటీ సభ్యులను మున్సిపల్ చైర్మన్ నరేందర్ ఆధ్వర్యంలో ఎన్నున్నారు. 13వ వార్డు అధ్యక్షుడిగా నందిగామ శ్రీనివాస్, 20 వార్డు అధ్యక్షుడిగా మహావీర్ లహోటీ, 23వ వార్డు అధ్యక్షుడిగా కంది ముఖేశ్, 28వ వార్డు అధ్యక్షుడిగా ఎం. ప్రదీప్ నియమితులయ్యారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, మాజీ చైర్మన్ అగ్గనూరు విశ్వం, కౌన్సిలర్లు అంతయ్య, మహేశ్వరి, నాయకులు అల్వాల కృష్ణయ్య, పట్వారి శ్రావణ్ కుమార్, రవియాదవ్, దామోదర్యాదవ్ పాల్గొన్నారు.