మొక్కలు నాటి సంరక్షించాం..
గోప్యనాయక్తండా ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాం. ప్రతి రోజు విద్యార్థులతో పాటు మేము కూడా వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నాం. పాఠశాల ఆహ్లాదకరంగా మారింది. ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కల పెంపకం చేపట్టడం ద్వారా పాఠశాలలు హరిత పాఠశాలలుగా మారాయి.
విద్యార్థులకు స్వచ్ఛమైన వాతావరణం అందించడమే లక్ష్యం విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదుకోవాలని, స్వచ్ఛమైన వాతావరణం అందించడమై లక్ష్యంగా కృషి చేస్తున్నాం. హరతహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో 50 మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. మొదటి విడుత హరితహారంలో నాటిన మొక్కలు వృక్షాలుగా మారి ఆహ్లాదకమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. పాఠశాలలో మరిన్ని మొక్కలు నాటి పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం.
సుధా, ప్రధానోపాధ్యాయురాలు, మోమిన్పేట బారుల ఉన్నత పాఠశాల
పచ్చదనం పరిశుభ్రత కోసం కృషి
కళాశాల పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలని కృషి చేస్తున్నాం. హరితహారంలో భాగంగా 100 మొక్కలు నాటి రోజు నీరు పడుతూ సంరక్షిస్తున్నాం. నాటిన మొక్కలు వృక్షాలుగా మరి విద్యార్థులకు మంచి వాతావరణం అందిస్తున్నాయి.
చెన్నయ్య,ప్రిన్సిపాల్, మోమిన్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల
మొక్కలే నా ప్రాణం..
కోట్పల్లి పాఠశాలలో ప్రతి సంవత్సరం 50 నుంచి 100 మొక్కలు నాటుతూ వాటికి నీళ్లు పోసి సంరక్షిస్తున్నాం. దాదాపుగా 500 మొక్కలు పాఠశాలలో నాటి, సంరక్షించాను. ఇప్పుడు అవి ఎంతో మందికి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటుగా మంచి గాలిని అందిస్తున్నాయి.
1500ల మొక్కలను సంరక్షిస్తున్నాం..
పాఠశాల ఆవరణలో మూడు సంవత్సరాల కాలంగా దాదాపు 1500ల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నాం. ప్రత్యేకంగా నీటి ట్యాంకర్ను ఏర్పాటు చేసుకొని నీటిని అందిస్తున్నాం. నేడు పాఠశాల చుట్టూ పచ్చదనం పరచుకుని ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది.
పర్యావరణంపై అవగాహన కల్పిస్తాం..
పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ పాఠశాలల్లో మొక్కలు పెంచుతున్నాం. ప్రతి రోజూ నాటిన మొక్కను సంరక్షించేందుకు విద్యార్థులకు బాధ్యతలు అప్పజెప్పాం. అన్ని రకాల పూలు, పండ్లు, ఔషధ మొక్కలను నాటాం.