రూ.1.50కోట్ల జడ్పీ నిధులతో మండలం అభివృద్ధి
జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్రెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కోట్పల్లి, ఏప్రిల్ 6 : పల్లెలు పచ్చదనంతో కళకళలాడాలని జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ఆయా పంచాయతీల్లో జడ్పీ నిధులు రూ.1.50కోట్ల చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధే ధ్యేయంగా జడ్పీ నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, తదితర పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతుబీమా, రైతుబంధు పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. కంకణాలపల్లి గ్రామంలో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీటిని పరిశీలించిన సునీతారెడ్డి వెంటనే నల్లా బిగించాలని స్థానిక సర్పంచ్కు సూచించారు. అనంతరం కోట్పల్లి పోచమ్మ దేవాలయం వద్ద నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీహాల్ను ప్రారంభించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అనీల్, ఎంపీపీ నల్లొళ్ల శ్రీనివాస్రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు సూర్యకళ, పద్మమ్మ, పాండురంగారెడ్డి, వెంకటేశం, మల్లయ్య, శోభారాణిరాములు, చంద్రకళ, అనితారెడ్డి, సావిత్రిగౌడ్, రాంచందర్, లక్ష్మీవెంకటయ్య, విజయలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.