వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్
పాల్గొన్న వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు, రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్
వికారాబాద్, ఏప్రిల్ 6: కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. కరోనా నివారణ చర్యలపై కలెక్టర్లతో మంగళ వారం హైదరాబాద్ నుంచి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్వాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తున్నదని, దీనిని దృష్టి లో పెట్టుకొని కరోనా నియంత్రణ చర్యలు పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లా పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం 100, సామాజిక కేం ద్రాల్లో 150, సివిల్ ఆసుపత్రుల్లో 300 పరీక్షలు ప్రతి రోజూ నిర్వహించాలని, వాటి ఫలితాలను కొవిడ్ యాప్లో ఎప్పటికప్పుడు నమోదుచేయాలని తెలిపారు. కొవిడ్ వ్యాప్తిస్తున్న వా రిని గుర్తించి వారిని హోంక్వారంటైన్ చేయాలని, ఇండ్లల్లో వసతి లేనివారి కొరకు ప్ర భుత్వ క్వారంటైన్ హోంలకు తరలించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు అదేశించారు. కరోనా అధికంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి సదరు ప్రాం తాలలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు.
ప్రతి పీహెచ్సీ పరిధిలో 125 మందికి, సీహెచ్సీ పరిధిలో 250 మందికి, సివిల్ ఆసుపత్రి పరిధిలో 300 మందికి ప్రతి రోజు కరోనా వ్యాక్సినేషన్ అందించాలని సీఎస్ అన్నారు. ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సామూహిక కార్యక్రమాలు, సభలకు అను మతి ఇవ్వరాదన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు వినియోగించేలా చర్యలు తీసు కోవాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించాలని ఆయన ఆదేశించారు. జిల్లా స్థాయిలో కరోనా వైద్యానికి చికిత్స అందిం చేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలన్నారు. కేసులు అధికంగా వస్తే ఆసుపత్రి స్థాయిలో చికిత్స అందించేందుకు వీలుగా ఆసుపత్రులను సిద్ధం చేయాలని తెలిపారు. కొవిడ్ కోసం ప్రత్యక్షంగా పడకలు , వార్డులను సిద్దం చేసుకోవాలని సీఎస్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పౌసుమిబసు అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఎంఅండ్ హెచ్వో సుధాకర్షిండే, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో రిజ్వానా, డాక్టర్ అరవింద్, డాక్టర్ యాదయ్య పాల్గొన్నారు.
లక్ష్యం మేరకు వ్యాక్సిన్ ఇస్తున్నాం
జిల్లాలో లక్ష్యం మేరకు కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నామని, 45 ఏండ్లు పైబడిన వారందరికీ అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ తెలిపారు. ప్రభుత్వ జీవో 68,69 ఉత్తర్వులను కఠినంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వైద్య అధికారులు, సంబంధిత అధికారులతో కరోనా నేపథ్యంలో జిల్లాలో చేపట్టవలసిన చర్యలపై కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని కొండాపూర్, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రులలో వెంటిలేటర్, ఆక్సిజన్తో కలిపి మొత్తం 130 కొవిడ్ బెడ్స్ ఉన్నాయని, హోమ్ ట్రీట్మెంట్ కిట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. అవసరం మేరకు కిట్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
కొవిడ్ కేర్ కేం ద్రాల్లో సిబ్బంది 24గంటల వైద్యసేవలను అందించేందుకు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ల ద్వారా మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, మాస్కులు ధరించకుంటే జరిమానాలు విధించాలని చెప్పారు. కరోనా టెస్టులు పెంచాలని, ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని, జిల్లాలో కరోనా కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతీక్జైన్, తిరుప తిరావు, జిల్లా వైద్యారోగ్యశాఖఅధికారి స్వరాజ్యలక్ష్మి, డీపీవో శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.