కులకచర్ల, ఏప్రిల్ 3: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నదని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శనివా రం మండలంలోని చౌడాపూర్లో గ్రామ పంచాయతీ నిధు లు రూ.16 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు వారు శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్ర తి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదన్నారు.
పీరంపల్లిలో..
మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పీరంపల్లి గ్రామంలో సర్పంచ్ రాధిక, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు నర్సింహులు ఆధ్వర్యంలో నూతన సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందన్నారు. ముదిరాజ్లు చేపలు పెంచుకునేందుకు అవకాశం కల్పించేలా అసెంబ్లీలోనిర్ణయించేందుకు కృషి చేస్తానన్నారు. పీరంపల్లిలో ముదిరాజ్ భవనానికి రూ.10 లక్షలు మంజూరుచేయిస్తానన్నారు. భవనం కోసం స్థలాన్ని చూపించాలన్నారు. గ్రామంలో ఎకరా భూమిని చూపిస్తే 20 మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చేలా చేస్తానన్నారు. డీసీసీబీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుయ్యని మనోహర్రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులు ఐక్యంగా సంఘాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కృషిచేయాలన్నారు.
ఘనాపూర్లో క్రికెట్ టోర్నీ ప్రారంభం
ఘనాపూర్ గ్రామంలో సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ వెంకటమ్మ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నీని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్ నాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, చౌడాపూర్ సర్పంచ్ కొత్త రంగారెడ్డి, ఎంపీటీసీ శంకర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, నాయకులు సుధాకర్రెడ్డి, శేరి రాంరెడ్డి, రాజశేఖర్, నాగరాజు, శంకర్, ముదిరాజ్ సంఘం సభ్యులు, టీఆర్ఎస్ మండల యూత్ నాయకుడు వెంకట్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.