ముషీరాబాద్ : సాధన సాహితీ స్రవంతి, త్యాగరాయగానసభల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ రాధశ్రీ రచించిన రమణాచార్య శతకము ఆవిష్కరణ సభ బుధవారం చిక్కడపల్లి కళా సుబ్బారావు కళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఏపీ శాసన సభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ పాల్గొని రమణాచార్య శతకాన్ని ఆవిష్కరించి తొలి పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి.రమణాచారికి అందచేశారు.
ఓయూ తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి, రచయిత డాక్టర్ ఓలేటి పార్వతీశం, గొడవర్తి సంధ్య, సాధన సాహితీ స్రవంతి సంస్థ అధ్యక్షుడు సాధన నరసింహాచార్య తదితరులు పాల్గొన్నారు.