పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు
మంకీ ఫుడ్కోర్టులో తీరొక్క పండ్ల మొక్కలు
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనం
హరితహారంతో పల్లెకు పచ్చందాలు
పెగడపల్లి మండలంలోని నందగిరి గ్రామ జనాభా 2156. ఈ ఊరు పల్లె ప్రగతితో కొత్తందాలను సంతరించుకున్నది. రెండేళ్లలో సుమారు 28 లక్షల నిధులు మంజూరయ్యాయి. వీటితో పాటు ఎస్ఎఫ్సీ, పన్నుల ద్వారా వచ్చిన నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. 27 రోడ్లు నిర్మించగా ఇందులో 15 సీసీ రోడ్లు కాగా, 12 బీటీ రోడ్లు ఉన్నాయి. 13 లక్షలతో వైకుంఠ ధామం నిర్మించడంతో ఆఖరి మజిలీకి కష్టాలు తీరాయి, 5 లక్షలతో కోతుల ఆహారశాల, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. 2 లక్షలతో కంపోస్ట్ షెడ్, డంప్యార్డ్ నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. హరితహారం కింద ఇంటింటా, రోడ్ల వెంట మొక్కలు నాటి సంరక్షించారు. ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంప్యార్డ్కు తరలిస్తున్నారు. క్రమం తప్పకుండా డ్రైనేజీలను శుద్ధి చేస్తున్నారు. అలాగే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 8.70 లక్షలతో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ కొనుగోలు చేశారు.
ఇవి కూడా చదవండి..
అంజలికి కరోనా .. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
భారత్లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా