కొవిడ్ నిబంధనల మేరకుదర్శనానికి భక్తులకు అనుమతి
తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు
మల్యాల, ఏప్రిల్ 10: కొండగట్టు అంజన్న ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. కొవిడ్ నిబంధనల మేరకు భక్తులను దర్శనానికి అనుమతించారు. భౌతికదూరం పాటించేలా క్యూలైన్లలో ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భేతాళస్వామి, ము నిగుహలు, బొజ్జపోతన, కొండలరాయుని అడుగులు, కోదండరామాలయం తదితర ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకున్నారు. శనివారం స్వా మివారిని సుమారు 10వేల మంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈవో చంద్రశేఖర్, ఏఈవో బుద్ధి శ్రీనివాస్, సూపరింటెండెంట్ శ్రీనివాస్శర్మ, ఆలయ ఇన్స్పెక్టర్లు రాజేశ్వర్రావు, సంపత్, పోలీస్ సిబ్బంది రాంచంద్రం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నర్సన్న సన్నిధిలో..
ధర్మపురి, ఏప్రిల్ 10: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని శనివారం భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలాచరించారు. అనంతరం ప్రధాన, అనుబంధ ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ ఆవరణ, క్యూలైన్లలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సిబ్బంది శానిటైజర్ స్ప్రే చేశారు. అలాగే దేవాలయ వసతి గృహాల్లోనూ స్ప్రే చేశారు. మాస్కులు లేని భక్తులను లోనికి అనుమతించలేదు. గోదావరిలో ప్రమాదకరమైన సత్యవతి గుండం, బ్రహ్మగుండం వైపు భక్తులు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది చేసిన ఏర్పాట్లను ఈవో శ్రీనివాస్ పర్యవేక్షించారు.