చాదర్ఘాట్ :పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా దవాఖానాల్లో ఈ నెల 12 నుండి నుమోనియా నుంచి రక్షించుకునేందుకు ఆరు వారాలు నిండిన చిన్నారులకు పెంటావాలెంట్ 1 టీకా ఉచితంగా ఇవ్వబడుతుందని డిప్యూటీ డీఎంహెచ్ఓ, మలక్పేట క్లస్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ బ్రిజున్నీసా బేగం తెలిపారు. అదే విధంగా 14 వారాలు పూర్తయిన చిన్నారులకు తదుపరి డోసు, 9 నెలల వయస్సులో బూస్టర్ డోస్ ను పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ప్రైవేట్ దవాఖానాలు, క్లినిక్లలో ఈ టీకా కు దాదాపు ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నా రు. ప్రభుత్వ యూపీహెచ్సీ, ఏరియా దవాఖానాల్లో టీకాను ఉచితంగా ఇస్తారని, చిన్నారుల తల్లితండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.