ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
నియోజకవర్గ వ్యాప్తంగా జయంతి వేడుకలు
చొప్పదండి, ఏప్రిల్ 11: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండలో అశోక్ ఆదిత్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యతోనే వ్యవస్థ మారుతుందని గ్రహించిన మేధావి ఫూలే అని కొనియాడారు. పాఠశాలలు ఏర్పాటు చేసి బడుగు, బలహీన వర్గాల వారికి విద్యనందించిన మహనీయుడని పేర్కొన్నారు. అంటరానితనం, సమసమాజ నిర్మాణం, మహిళా అభివృద్ధి, బాల్యవివాహాలను అరికట్టేందుకు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, ఎంపీటీసీ గొల్ల సునంద, వార్డు సభ్యులు సింగిరెడ్డి రవళి, కోలపాక ప్రశాంత్, చీకట్ల అర్జున్, నాయకులు మాచర్ల వినయ్,యశోద రాజయ్య, మచ్చ రమేశ్, వడ్లూరి భూమయ్య, పూసాల మహేశ్, కేతిరెడ్డి మణిశంకర్రెడ్డి, కడారి రాజయ్య, దొంత రాజయ్య, దామెర మధుసూదన్రెడ్డి, చాతర్ల కిషన్, పెద్ది మహేశ్, చిలుముల సురేశ్, అశోక్ ఆదిత్య యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో..
ఆర్నకొండలో తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ గుండేటి తిరుపతి ఆధ్వర్యంలో ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ హాజరై ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాగృతి ఆరోగ్య విభాగం కన్వీనర్ మ్యాకల తిరుపతి, మండల కన్వీనర్ పిట్టల సత్యం తదితరులు పాల్గొన్నారు. చొప్పదండిలో ఫూలే చిత్రపటానికి నవతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నవతరం యువజన సంఘం ప్రధాన కార్యదర్శి తాడూరి శివకృష్ణ, విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షుడు చిలుకునూరి లవన్కుమార్, యువన సంఘం నాయకులు రాజ్కుమార్, సాయిగణేశ్, ఏముండ్ల రాకేశ్, సంపత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆవరణలో ఫూలే చిత్రపటానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అంబేద్కర్ యువజన సంఘం పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, జాతీయ అవార్డు గ్రహీతలు సముద్రాల అంజయ్య, బత్తులు భూమయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం పట్టణాధ్యక్షుడు పెద్దెల్లి శ్రీనివాస్, నాయకులు మాచర్ల వినయ్, కల్లెపల్లి రత్నం, కడారి శంకర్, కడారి రాజలింగం, సదానందం, శివ, ప్రశాంత్, భీంరాజ్, మావురం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, ఏప్రిల్ 11: మధురానగర్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే అని కొనియాడారు. అంటరానితనం నిర్మూలనకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కొలెపాక స్వామి, నాయకులు వేముల అంజి, వాసాల గంగాధర్, దోమకొండ మల్లయ్య, లింగాల దుర్గయ్య, శనిగరపు నరేశ్, ద్యావ సంజీవ్, ద్యావ అంజయ్య, గడ్డం ఎల్లయ్య, గంగాధర శంకర్, గంగాధర రఘు తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, ఏప్రిల్ 11: మండలంలోని రామడుగు, వెలిచాలలో ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. వెలిచాలలో అన్నదాత రైతు సంక్షేమ సంఘం సభ్యులు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో దళిత సంఘాల నాయకులు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో అన్నదాత రైతు సంఘం అధ్యక్షుడు వంగ ప్రభాకర్గౌడ్, కార్యదర్శి పెద్దిగారి ఎల్లయ్య, లక్ష్మీపతి, శ్రీనివాస్, వార్డు సభ్యుడు వెంకటరమణ, కుర్మ సంఘం జిల్లా యువజన కార్యదర్శి ఎల్లమ్మల నర్సింహరాజు, ఆర్బీఎస్ గ్రామ కో-ఆర్డినేటర్ పెరుమండ్ల శ్రీనివాస్, పరశురాములు, రాజయ్య, నర్సయ్య, శ్రీనివాస్, కనకయ్య, రాజేందర్, సర్పంచ్ పంజాల ప్రమీల, వైస్ ఎంపీపీ పూరెల్ల రాజ్గోపాల్గౌడ్, వెన్న రాజమల్లయ్య, మాజీ సర్పంచులు కాడె శంకర్, పంజాల జగన్మోహన్గౌడ్, అశోక్కుమార్, కలిగేటి లక్ష్మణ్, మన్నె కిషన్చందర్, రవీందర్, అనిల్, మహేశ్, శ్రీనివాస్, మురళి, రమేశ్, ఎల్లయ్య, శ్రీనివాస్, నరేశ్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి