ధర్మారం, ఏప్రిల్5: మండల కేంద్రంలో యా దవుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన బీరన్న ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారు జాము నుంచి ఇంటికో బోనంతో పెద్ద సంఖ్యలో మహిళలు ఊరేగింపుగా బయల్దేరారు. ఊరేగింపులో సర్పంచ్ పూస్కూరు జితేందర్రావు, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఉప సర్పంచ్ ఆవుల లత పాల్గొన్నారు. మహిళలు బోనాలను గుడి వద్ద పెట్టి నైవేద్యం పెట్టి మొ క్కులు సమర్పించారు. బీర్ల పూజారులు బీరన్న దేవుడికి, కామరాతి దేవతామూర్తికి కల్యాణం చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు తుమ్మల ఓదెలు, దాగేటి లావణ్య, ఆవుల మల్లేశం, దాగేటి అనిల్, యాదవులు జంగ మహేందర్, తమ్మడవేని మల్లేశం, సులిగె శేఖర్, దాగేటి భూమయ్య, అరుకుటి మల్లేశం, తుమ్మల రాజేశం, దాగేటి శంకరయ్య, తుమ్మల కొమురయ్య, నలిగేటి గట్టయ్య, ఆవుల శ్రీనివాస్, నలిగేటి కుమార్, తుమ్మల తిరుపతి, జంగ గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి, ఏప్రిల్5: కుక్కలగూడూర్లో కొమురవెల్లి మల్లన్న జాతర వైభవంగా జరిగింది. ఒగ్గుకథ ప్రదర్శన, అగ్నిగుండం ప్రవేశం, పంచామృతాలతో రుద్రాభిషేకం, పెద్దపట్నం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులకు పాలకుర్తి ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యరాంరెడ్డి అన్నదానం చేశారు. సర్పంచ్ గోండ్ర చందర్ పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 5: పెద్దపల్లి మండలం రాఘవాపూర్లో బీరన్న, కామరతి పట్నాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం తెల్లవారు జామునుంచి గ్రామంలోని గొల్ల, కుర్మలంతా బోనాలతో ఊరి పొలిమేరల నుంచి ఒగ్గు, బీర్ల పూజారుల నృత్యాల నడుమ భారీ ర్యాలీగా బీరన్న ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో పెద్దపట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. బసంత్నగర్ ఎస్ఐ షేక్ జానీపాషా ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
summer effect: అగ్నిప్రమాదాల నుంచి మీ వాహనాలు కాపాడుకోవాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
భారత తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు కన్నుమూత