ఉస్మానియా యూనివర్సిటీ : గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగురవేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిగ వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన ఆశయాలను కొనసాగించడం ద్వారానే పాపన్నకు నిజమైన నివాళి అర్పించినట్లు అన్నారు.
పాపన్న జనరంజకంగా పాలించాడని గుర్తు చేశారు. సాధారణ గౌడ్ కుటుంబం నుంచి వచ్చి, రాజ్యాన్ని స్థాపించడం గొప్ప విషయమన్నారు. ఆయన రాజ్యంలో అసలు పన్నులు ఉండేవి కావని, సామాజిక న్యాయం పాటిస్తూ ఎంతో గొప్పగా పాలించాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, జేఏసీ నాయకులు బండారి వీరబాబు, మంద సురేశ్, క్రాంతి, కృష్ణ, నవీన్, భాస్కర్యాదవ్, దశరథ్, జిల్లా నాగయ్య, జంగయ్య, కాటం శివ, మిథున్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.