దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చి తిరుగులేని శక్తిగా నిలిచింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నది. పార్టీ పురుడు పోసుకుని 20 ఏండ్లు గడిచిన సందర్భంగా వచ్చేనెల 15న వరంగల్ వేదికగా విజయగర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. గులాబీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో సంస్థాగత నిర్మాణం పూర్తి కావడంతో ద్విదశాబ్ది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని తరలించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో రోజుకు 20 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ వరుసగా భేటీ అవుతున్నారు. సోమ, మంగళవారాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో సమీక్షించారు. సభ విజయవంతానికి చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
నిజామాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో జాతీయ పార్టీల కన్నా మిన్నగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి అతి పెద్ద పార్టీగా అవతరించింది. సంస్థాగత నిర్మాణంలో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో గ్రామ, పట్టణ, నియోజకవర్గ, జిల్లా, అనుబంధ కమిటీల కూర్పు పూర్తయ్యింది. గులాబీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో సంస్థాగత నిర్మాణం పూర్తి కావడంతో ద్విదశాబ్ది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 20 ఏండ్ల క్రితం పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, బంగారు తెలంగాణ సాధనకు సాగుతున్న ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. నవంబర్ 15న వరంగల్ వేదికగా జరిగే తెలంగాణ విజయ గర్జనకు రాష్ట్రం నలుమూలల నుంచి వీలైనంత ఎక్కువ మందిని సభకు తర లించేందుకు పటిష్టవంతమైన కార్యాచరణను వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ సారథ్యంలో జరుగుతోంది. లక్షలాది మందితో ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగే విధంగా విజయ గర్జన సభను నిర్వహించాలని అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో రోజుకు 20 అసెంబ్లీ నియో జక వర్గాల నే తలతో కేటీఆర్ వరుసగా భేటీ అవుతున్నారు. సోమ, మంగ ళవారాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంత్రు లు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులతో సమీక్ష పూర్తయ్యింది.
15న వరంగల్లో భారీ బహిరంగ సభ
టీఆర్ఎస్ 20 ఏండ్ల పండుగను పురస్కరించుకుని వచ్చే నెల 15న వరంగల్లో భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ తలపెట్టిం ది. తెలంగాణ విజయ గర్జన పేరుతో నిర్వహించే ప్రతిష్టా త్మక సభను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరీంనగర్లో జరిగి న సింహ గర్జన సభను మించి విజయ వంతం చేయాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే శ్రేణు లకు పిలుపునిచ్చింది. తెలం గాణ ప్రజల స్వరాష్ట్ర కల సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అద్భుత పాలనతో ప్రతి కుటుంబం సుఖశాం తు లు, చిరునవ్వులతో జీవిం చేలా చేస్తూ, వారి గుండెల్లో నిలుస్తున్నారు. ఉద్యమంలో, బంగారు తెలంగాణ సాధన లో కేసీఆర్ అకుంఠిత దీక్షకు కృతజ్ఞతగా ఆయనపై అభిమా నాన్ని చాటే విధంగా బ్రహ్మండంగా సభ జరగాలని గులాబీ శ్రేణులకు పార్టీ ఆదేశించింది. ప్రతి పల్లె, పట్టణం, నగరాలు సభ వైపు కదలేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చేలా సమన్వయం చేసుకునేలా యాక్షన్ ప్లాన్ను ఆయా జిల్లాల బాధ్యులకు స్వయంగా కేటీఆర్ వివరిస్తున్నారు. విజయ గర్జన సభ, ఈ నెల 25న ప్లీనరీ సన్నాహాల్లో భాగంగా వాటి ఇన్చార్జిగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నేరుగా తెలంగాణ భవన్లో రోజుకు 20 నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశం అవుతున్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా నేతలతో, మంగళవారం నిజామాబాద్ జిల్లా నాయకులతో కేటీఆర్ సమీక్ష నిర్వహిం చారు.
ధూంధాంగా. . ద్విదశాబ్ది వేడుక…
తెలంగాణ భవన్లో ఈ నెల 18న కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలకు చెందిన నాయకులతో కేటీఆర్ భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల నాయకులతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకలు కరోనా కారణంగా రెండేండ్లుగా జరుపుకోలేదు. వార్షికోత్సవ సభలు కూడా నిర్వహించలేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని లక్షల మందితో ఘనంగా జరిపే ఆనవాయితీ టీఆర్ఎస్కు మొదట్నుంచి ఉంది. కరోనా పరిస్థితిని చూసుకుని సరైన సమయంలో అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్లో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ద్విదశాబ్ది సంవత్సరంగా 2021ను టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో నిర్వహిస్తోన్న ప్లీనరీ, విజయ గర్జన సభలు ముఖ్యమైన ఘట్టాలు. మంత్రులు, జిల్లా ప్రజా ప్రతినిధులతో సమన్వయ లోపాలు లేకుండా ఉండేందుకు నేరుగా కేటీఆరే రంగంలోకి దిగి ముఖ్య నాయకులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్లో ప్లీనరి నుంచి మొదలు పెడితే నవంబర్ 15వ భారీ సభ వరకు ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. గ్రామ, మండల స్థాయి కార్యకర్తల సమావేశాల అనంతరం ఈ నెల 27న జరిగే నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలను పక్కాగా పూర్తి చేసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
దేశం చూపు… తెలంగాణ వైపు…
నూతన రాష్ట్రంగా ఏర్పడి అనతి కాలంలోనే ప్రగతి ప్రస్థానంలో మేటిగా నిలుస్తున్న తెలంగాణ వైపు యావత్ దేశం తరచి చూస్తోంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం పురోగమిస్తోంది. ప్రగతిలో పరుగులు తీస్తోంది. జాతీయ సగటు కన్నా ఎక్కువగా వృద్ధిరేటును సాధిస్తూ మిగితా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రాజకీయ పార్టీల పరంగానూ టీఆర్ఎస్ పార్టీ ఓ రకంగా ట్రెండ్ సెట్టర్గా మారింది. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ 20 ఏండ్లలో అంచెలంచెలుగా ఎదిగి రికార్డు స్థాయిలో విజయాలు సాధించింది. ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతగా బలాన్ని దక్కించుకుని సభ్యత్వాల్లో, సంస్థాగత నిర్మాణాల్లో ముందుంది. అనేక ప్రాంతీయ పార్టీలు కుదేలవుతున్న ప్రస్తుతం సందర్భంలో జాతీయ పార్టీలను వెనుకకు నెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం ముందడుగు వేస్తోంది. కాంగ్రెస్, బీజేపీలను తలదన్నే రీతిలో ఎదిగి ఒదిగి ప్రజల వైపు నిలుస్తోంది.