డిచ్పల్లి, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆర్టీసీ చైర్మన్గా నియమితులైన రెండో వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ శాసనసభ్యుడిగా పేరున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఇటవలే టీఎస్ ఆర్టీసీ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం హైదరాబాద్లోని బస్ భవన్లో ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గోవర్ధన్ ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఇందుకుసంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బాజిరెడ్డి ప్రమాణస్వీకారం నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ మండలంతోపాటు వివిధ గ్రామాల ప్రజలు, అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు.
బాజిరెడ్డికి ఎమ్మెల్యే షిండే శుభాకాంక్షలు
నిజాంసాగర్, సెప్టెంబర్ 19 : ఆర్టీసీ చైర్మన్గా నియమితులైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధనన్కు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని బాజిరెడ్డి నివాసంలో ఆదివారం పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే హన్మంత్షిండే కుమారుడు దీపక్ షిండే, హరీశ్ షిండే, ప్రభాత్ షిండే తదితరులు ఉన్నారు.