జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే
పిట్లం/ లింగంపేట/దోమకొండ, సెప్టెంబర్ 18 : ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. పిట్లం మండలకేంద్రంలోని సాయి గార్డెన్లో శనివారం నిర్వహించిన పోషణ మాసోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదన్నారు. అనంతరం అంగన్వాడీ సిబ్బంది 35 మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించారు. 35 మంది గర్భిణులకు జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షుడు కుమ్మరి యాదగిరి అంగన్వాడీ కార్యకర్తల చేతుల మీదుగా చీరెలను అందజేశారు. ఎంపీపీ కవితావిజయ్, జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీబాయి బాబుసింగ్, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి, సీడీపీవో అనురాధ, ఎంపీటీసీలు, అంగన్వాడీ సూపర్వైజర్ పద్మావతి పాల్గొన్నారు.
లింగంపేట మండలంలోని ఐలాపూర్ గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలను నిర్వహించారు. సర్పంచ్ తుమ్మలపల్లి ధనలక్ష్మి ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఫరీదా, ఐకేపీ సీసీ శ్రావణ్, ఏఎన్ఎం నౌసీన్ పాల్గొన్నారు.
దోమకొండ మండలంలోని ముత్యంపేట, సీతారాంపల్లి గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ లత, సీసీలు రాజేశం, రమేశ్, శ్రీనివాస్, సర్పంచ్ సూర్యప్రకాశ్, ఉపసర్పంచ్ శిరీష్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.