డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి..
నిమజ్జన శోభాయాత్రలో ప్రధానంగా ఆయా వినాయక విగ్రహాలను ఊరేగించే వాహనాల డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. విగ్రహాలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లుజరగకుండా ముందుగానే సదరు డ్రైవర్లకు సూచనలివ్వాలి.
అనుభవజ్ఞులైన డ్రైవర్లనే ఎంచుకోవాలి.
మద్యం, మత్తు పానీయాలకు దూరంగా ఉంచాలి.
ముందు, వెనుక, పక్కభాగాలను పరిశీలిస్తూ డ్రైవింగ్ చేయాలి.
విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వినాయక ప్రతిమకు తగిలే అవకాశం ఉంటే అవి వెళ్లే వరకు పూర్తిశ్రద్ధతో వాహనం నడిపి వాటిని తప్పించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి లోనుకాకూడదు.
ముగింపు వేళ ..
నిమజ్జనానికి అనువైన చెరువును ఎంచుకోవాలి.
భారీ విగ్రహాల నిమజ్జనానికి యంత్రాలు వినియోగించాలి.
ఈత రానివారు నీళ్లలో దిగకూడదు.
ఈతలో ప్రావీణ్యం ఉన్నవాళ్లు ఈ తంతును పూర్తి చేయాలి.
ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు సమన్వయంతో మెలగాలి.
నిమజ్జన సమయంలో అధికార యంత్రాం గం ఏర్పాటు చేసే క్రెయిన్లు, తదితర వాటి సమీపంలోకి వెళ్లకూడదు
కొట్లాటలకు తావివ్వొద్దు..
ఉత్సవాల్లో తగాదాలు, కొట్లాటలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్త పడాలి. ఐకమత్యంతో మెలగాలి.
కొట్లాటలకు తావివ్వకుండా పర్యవేక్షణ కమిటీని నియమించాలి.
తగాదాలు జరిగే పరిస్థితి నెలకొంటే పెద్దలు సర్దిచెప్పాలి.
వీలైనంత వరకు కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తే ఎలాంటి అపశృతులకు తావుండదు.
బైబై గణేశా..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విగ్రహాల శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. భజనలు, బ్యాండు చప్పుళ్లు, నృత్యాల హోరుతో భక్తులు వీడ్కోలు పలికారు.
విద్యుత్తో చెలగాటం వద్దు..
వినాయక నిమజ్జనోత్సవ సమయంలో చేతికి తాకేలా లైటింగ్ సెట్లు, ఇతర పరికరాలు ఉంచకూడదు.
షార్ట్ సర్క్యూట్కు ఎలాంటి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించేందుకు కమిటీ ప్రత్యేక సభ్యులను నియమించాలి.
విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పచ్చికట్టెలతో, నీటిలో ఉండే తీగలను తాకొద్దు.
ఊరేగింపులో జాగ్రత్త..!
బొజ్జగణపయ్య ఊరేగింపులో ఎన్నో అపశృతులకు ఆస్కారముంది. అంతా సవ్యంగా సాగేలా నిర్వాహకులు చొరవ చూపకుంటే అనర్థాలకు చోటిచ్చినట్లే. ఊరేగింపు జరుపుతున్న విషయాన్ని ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అదే సమయంలో అవసరమైతే బందోబస్తు కూడా కోరాలి.
నిర్ణీత సమయంలో శోభాయాత్ర ముగిసేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
నృత్యాలు, కోలాహలం హద్దు దాటకూడదు.
చిన్న పిల్లలను ఊరేగింపులోకి అనుమతించకూడదు.
శోభాయాత్రలో పటాకులు, తదితర పేలుడు పదార్థాలు ఉపయోగించొద్దు.