అవగాహన కల్పించిన పోలీసులు, అధికారులు
పలు మండలాల్లో స్పెషల్ డ్రైవ్
మాస్కులు ధరించని వారికి జరిమానా
శక్కర్నగర్, ఏప్రిల్ 12: కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. మాస్కు ధరించని వారికి రూ. వెయ్యి జరిమానా విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీసులు, అధికారులు సోమవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మాస్కులు ధరించాలని ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించారు.మాస్కులు ధరించని వారికి జరిమానా విధించారు.
బోధన్ పట్టణంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో మాస్కుల వినియోగంపై ప్రజలకు, వర్తకులకు బోధన్ ఏసీపీ రామారావు అవగాహన కల్పించారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లోనుంచి బయటికి రావద్దని సూచించారు. మాస్కులు లేకుండా వెళ్లే వాహనదారులకు చేతిరుమాలైనా ముఖానికి కట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ రమన్, ఎస్సైలు విఠల్రావు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
భీమ్గల్లో..
భీమ్గల్, ఏప్రిల్ 12: భీమ్గల్ పట్టణంలో మాస్కులు లేనివారికి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎస్సై ప్రభాకర్ జరిమానాలు విధించారు. సోమవారం అంగడి కావడంతో మార్కెట్ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని సూచించారు.
మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో..
మోర్తాడ్, ఏప్రిల్ 12: కమ్మర్పల్లి ఎస్సై శ్రీధర్గౌడ్ ఆధ్వర్యంలో హాసాకొత్తూర్, బషీరాబాద్ గ్రామాల్లో, మోర్తాడ్ ఎస్సై సురేశ్కుమార్ ఆధ్వర్యంలో మోర్తాడ్లో మాస్క్ ధరించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆర్మూర్ మండలంలో..
ఆర్మూర్, ఏప్రిల్ 12: ఆర్మూర్ మండలంలోని పలు గ్రామాల్లో మాస్కు ధరించని వారికి పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. ఆర్మూర్లో రూరల్ సీఐ విజయ్ కుమార్, ఏసీపీ రఘు, ఎస్సైలు యాదగిరి గౌడ్, శ్రీకాంత్, ఆర్మూర్ తహసీల్దార్ లక్ష్మణ్, మున్సిపల్ అధికారులు స్పెషల్డ్రైవ్ నిర్వహించారు. ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించి, మాస్కులు ధరిం చని వారికి జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.
కొవిడ్ నిబంధనలపై అవగాహన
సిరికొండ/చందూర్/మోపాల్(ఖలీల్వాడి)/జక్రాన్పల్లి, ఏప్రిల్12: సిరికొండ పోలీస్స్టేషన్ ఆవరణలో వ్యా పారులకు కొవిడ్ నిబంధనలపై సీఐ శ్రీశైలం అవగాహన కల్పించారు. మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వారికి పోలీసులు జరిమానా విధించారు. చందూర్ లో కొనసాగిన వారసంతలో కొవిడ్పై అవగాహన కల్పిం చేందుకు ఎస్సై అనిల్రెడ్డి బ్యానర్లను ఏర్పాటు చేయిం చారు. మోపాల్ మండలంలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాస్కులు ధరించనివారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తామని సీఐ రవి, ఎస్సై పూర్ణేశ్వర్ స్పష్టం చేశారు. మాస్కు ధరించని వారికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామని జక్రాన్పల్లి ఎస్సై సాయారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
కొవిడ్ సెంటర్లుగా మారనున్న ఫైవ్స్టార్ హోటళ్లు
మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్