నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 10 : జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా పారిశుధ్య కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో పని చేసే సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్యారసెట్మోల్ మందులను శనివారం పంపిణీ చేశారు. అంతకు ముందు మున్సిపల్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాన్ని పరిశీలించారు. మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది తప్పనిసరిగా టీకా వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పూదరి రాజేశ్వర్, శానిటరి ఇన్స్పెక్టర్ రవీందర్, ఫయాజ్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో లాక్డౌన్ ప్రసక్తే లేదు : మంత్రి ఈటల
గంజాయి మాఫియా సూత్రధారి బాబుఖాలే అరెస్ట్