సత్వర న్యాయం అందించేందుకు లోక్అదాల్
భైంసా న్యాయమూర్తి ఈశ్వరయ్య
భైంసా, ఏప్రిల్ 10 : రాజీ మార్గమే రాజ మార్గమని కక్షిదారులకు భైంసా న్యాయమూర్తి ఈశ్వరయ్య పేర్కొన్నారు. పట్టణంలోని భైంసా కోర్టులో లోక్ అదాలత్ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడూ భారత రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తికీ జీవించే హక్కు, సమానత్వపు హక్కు ఉందని, వాటికి భంగం కలిగినప్పుడు కోర్టును ఆశ్రయించాలని తెలిపారు. నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత విజ్ఞానాన్ని పెంచుకునేందుకు వినియోగించాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించ వద్దని తెలిపారు. అనంతరం 72 కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవిదాస్ హస్డే, సోమేశ్, మాధవి, కీర్తివర్ధన్, న్యాయవాదులు సాయినాథ్, మురళీధర్, ముత్తన్న, అశోక్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
1079 రోజుల తర్వాత ఫస్ట్ సిక్స్ కొట్టిన మాక్స్వెల్
కొవిడ్తో నటుడు సతీష్ కౌల్ కన్నుమూత