అత్యధికంగా తాంసిలో 42.3 డిగ్రీలు
ఎండకు బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం
తాంసి, ఏప్రిల్ 7: జిల్లాలో సూర్యప్రతాపం మొదలైంది. మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు చేరాయి. బుధవారం తాంసి మండల కేంద్రంలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరడం పరిపాటి. మే నెలలో ఎండలు ఎక్కువగా నమోదు అయ్యేవి. కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
రెండు డోసులు తీసుకున్న తర్వాత.. 40 మంది డాక్టర్లకు కరోనా
సర్పంచ్ అభ్యర్థిగా 81 ఏండ్ల వృద్ధురాలు పోటీ..!