కడెం, ఏప్రిల్7: కరోనా వ్యాక్సిన్పై ప్రజలు అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. కడెం మండల కేంద్రంలోని 30 పడకల దవాఖానను బుధవారం ఆయన సందర్శించారు. దవాఖాన సిబ్బందితో మాట్లాడిన అనంతరం రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీకి వచ్చిన రోగులతో మాట్లాడిన ఆయన, 45 ఏండ్లు నిండిన వారు తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్పై వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించేలా ప్రజలకు వివరించాలని సూచించారు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది మరింత అప్రమత్తమై విధులు నిర్వర్తించాలన్నారు. తహసీల్దార్ కలీం, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, డాక్టర్ అరుణ్కుమార్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
త్రిపుర సీఎం బిప్లబ్కు కరోనా పాజిటివ్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఒమర్ అబ్దుల్లా