నారాయణపేట రూరల్, సెప్టెంబర్ 29: ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం ఒక్క పీఆర్టీయూతోనే సాధ్యమని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ అన్నారు. పేట జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్లో పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు త్వరలోనే పదోన్నతులు, బదిలీలు రాబోతున్నాయన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పెన్షన్ జీవో కూడా వెలువడనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతూ అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. హెల్త్ కార్డుల విషయంలో ఒక్క శాతం బేసిక్ పే డిడక్షన్తో అన్ని దవాఖానల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ వచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే పండిత్, పీఈటీల అక్రిడిటేషన్ 10వేల పీఎస్హెచ్ఎంల పదోన్నతులు రాబోతున్నాయన్నారు. సీపీఎస్ విధానం రద్దుకు చర్చలు జరుపుతామన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్రావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమానికి ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకత్వం నిరంతరం పని చేస్తుందన్నారు. పీఆర్సీ, ఏరియర్స్ రిటైర్మెంట్ తర్వాత కాకుండా ముందుగానే ఇచ్చే విధంగా సంఘం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్రెడ్డి, గౌరవాధ్యక్షుడు నర్సింహరెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, రఘువీర్, జనార్దన్, వెంకట్రెడ్డి, శేఖర్, సత్యనారాయణరెడ్డి, విశ్వనాథ్, వాణిశ్రీ, రియాజుద్దీన్ పాల్గొన్నారు.