30 వరకు ఆంక్షాలు అమలు
పెరుగుతున్న కరోనా కేసులు
ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలి
ఎస్పీ డాక్టర్ చేతన
నారాయణపేట, మార్చి 29 : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభు త్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్య లు తప్పవని ఎస్పీ డాక్ట ర్ చేతన అన్నారు. ప ట్టణంలోని ఎస్పీ కా ర్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, కరోనా ప్రభావాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింద ని, ఈ ఆదేశాలు ఈ నెల 30 వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్ వద్ద గుంపులుగా ఉండరాదని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించాల న్నారు. మాస్కులు ధరించకుండా, కొవిడ్ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరిగినట్లయితే విపత్తు నిర్వహణ చట్టం 51 నుంచి 60 సెక్షన్లు, 188 ఐపీసీ ప్రకారం జరిమానా విధించడంతోపాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని, గుంపులుగా ఉండడంపై నిషేధం విధించినట్లు చెప్పారు. అన్ని రకాల పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కరోనా బారిన పడకుండా తమను తాము రక్షించుకోవాలన్నారు.
పేట ఆర్డీవోగా వెంకటేశ్వర్లు
నారాయణపేట, మార్చి 29 : పేట ఆర్డీవోగా పెబ్బేరు భూ సేకరణ స్పెష ల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఇక్కడ ఆర్డీవోగా విధులు నిర్వహించిన చీర్ల శ్రీనివాసులును హైదరాబాద్లోని సీసీఎల్సీలో రిపోర్ట్ చేయాలని సోమవారం సీఎస్ సోమేష్కుమార్ ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో వెంకటేశ్వర్లు రానున్నారు.