కోస్గి, మార్చి 28 : మండలంలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. శనివారం రాత్రి మండలంలోని బలబద్రాయిపల్లి గ్రామ శివారులో కలప అక్రమంగా వెళ్తున్న లారీని కోస్గి పోలీసులు పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ఫారెస్టు అధికారుల చేతివాటం.. స్థానిక పోలీసులు అ త్యుత్సాహం.. కానీ తెల్లవారేసరికి లారీ పోలీస్స్టేషన్ నుంచి మాయమైంది. పోలీసు అధికారుల ప్రమేయం లేనిది లారీ ఎక్కడకు వెళ్తుందని.. జరిమానా విధించడానికైన ఆదివారం సెలవు దినం కావడంతో అంత ఉదయాన్నే లారీ యజమాని జరిమానా కట్టాడో తెలియని దుస్థితి. విషయంపై ఎస్సై నరేందర్ ను అడుగగా ఫారెస్టు అధికారులతో మాట్లాడి లారీని పంపించినట్లు తెలిపా రు. ఇదే విషయంపై ఫారెస్టు బీట్ అధికారిని వివరణ కోరగా అత్యవసర పని లో ఉన్నానన్నారు. ఏది ఏమైనా అక్రమ కలప రవాణాకు అధికారుల అందండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం హరితహారం పేరుతో మొ క్కలు నాటుతుంటే అక్రమ కలప వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై ప్రభు త్వ లక్షానికి తూట్లు పొడుస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కూరలో కరివేపాకు తీసిపారేస్తున్నారా?