నారాయణపేట టౌన్, అక్టోబర్ 16: జిల్లా కేంద్రంలో విజయదశమి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రజ లు తమ ఇండ్లల్లో కుటుంబ సభ్యులు, బంధువులతో ఉల్లాసంగా గడిపారు. సాయంత్రం వేళల్లో అంబాభవాని, కాళీమాత ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జమ్మిఆకును ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. తల్లిదండ్రులకు, పెద్దలకు జమ్మిఆకు ఇచ్చి పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు పొందారు.
ఆర్యసమాజంలో…
దసరా పండుగ సందర్భంగా పట్టణంలోని ఆర్యసమాజంలో యజ్ఞం, ధ్వజారోహనం, భజన, వ్యాఖ్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆర్యసమాజం నుంచి చేపట్టిన జెండా ఊరేగింపు రామ్లీలా మైదానం వరకు కొనసాగింది. అదేవిధంగా వీహెచ్పీ ఆధ్వర్యంలో మహంకాళీ దేవాలయం నుంచి రామ్లీలా మైదా నం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామ్లీలా మైదానం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ సీనియర్ నాయకులు నాగూరావు నామాజీ, ఆర్యసమాజ్ స భ్యులు దేవదత్త ఆర్య మన సంస్కృతి, ఆచార్య వ్యవహారా లు, మన కర్తవ్యం, దసరా పండుగ విశిష్టతను గురించి వివరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ వర్ధ్దన్, ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ మ్యాడం ప్రభాకర్, ఆర్యసమాజ్ మంత్రి కృష్ణభగవాన్, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
వివిధ గ్రామాల్లో
నారాయణపేటరూరల్, అక్టోబర్16: పేట మండలం లోని జాజాపూర్, సింగారం, కోటకొండ, కొల్లంపల్లి తదితర గ్రామాల్లో విజయదశమి వేడుకలు శుక్రవారం ఘనంగ జరుపుకొన్నారు.ఈ సందర్భంగ జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజ లు నిర్వహించి సాయంత్రం ఒకరికొకరు జమ్మి ఇచ్చిపుచ్చుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. జాజాపూర్ఆర్యసమాజంలో యజ్ఞం నిర్వహించి ఓం ధ్వజారోహణం చేశారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాజాపూర్ పాఠశాల మైదానంలో శమీపూజ నిర్వహించి జమ్మి పంచుకున్నారు. అలాగే కాట్రేగేరిలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక అలంకరణ చేసి పురవీధుల గుండా నృత్యాలు చేస్తూ ఊరేగించి చెరువులో నిమజ్జనం చేశారు.
ఊట్కూర్లో..
ఊట్కూర్, అక్టోబర్ 16 : దసరా పర్వదిన వేడుకలను శుక్రవారం అన్ని గ్రామాల్లో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకుని ఇళ్లూ వాకిళ్లను శుభ్రం చేసుకున్న ప్రజలు ఇంటి గుమ్మానికి మామిడి ఆకు, బంతిపూల తోరణాలు కట్టి ముస్తాబు చేశారు. మండలకేంద్రంలో ఆర్యసమాజ్ ప్రధాన్ కనకప్ప ఆర్య ఆధ్వర్యంలో పురవీధుల చుట్టూ శోభయాత్ర నిర్వహించారు. సాయంత్రం స్థానిక బసవన్న కట్ట దగ్గర పండుగ విశిష్టత గురించి ప్రజలకు ఉపదేశించారు. ఆయా గ్రామాల్లో పురోహితులు వేదమంత్రోచ్ఛారణతో జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్, ఆర్యసమాజ్ కమిటీ కార్యదర్శులు బాల్రాజ్ ఆర్య, పవన్కుమార్, నర్సింగప్ప, నర్సింహా పాల్గొన్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద, అక్టోబర్ 16: మండలంలోని వివిధ గ్రా మాల్లో దసరా పండుగ సంబురాలు ఘనంగా నిర్వ హించారు. మండల కేంద్రంలో శమీవృక్షానికి పూజలు ని ర్వహించి అనంతరం ఒకరికొకరు జమ్మి పంచుకొని శుభా కాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా దామరగిద్ద, అన్నాసాగర్, ముస్తాపేట, అయ్యవారిపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది, పనిముట్లు, చెత్త తరలించే ట్రాక్టర్కు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ వన్నడి ఆశమ్మ, రాఘవేందర్రెడ్డి, నాయకులు చంద్రకాంత్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చెడుపై మంచి విజయం
నారాయణపేట న్యూటౌన్, అక్టోబర్ 16: పట్టణంలోని 9వ వార్డులో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. చెడుపై మంచి విజయానికి ప్రతీకయే దసరా అని వార్డు కౌన్సిలర్ మహేశ్ అన్నారు. ఈ వేడుకల్లో బుల్లెట్ బండి పాట నే పథ్యంలో చిన్నారులు చేసిన డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే మహిళలు బతుకమ్మ పాటలుపాడుతూ ఆటలు ఆడారు. దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బతుకమ్మ పోటీల్లో గెలుపొందిన విజేతలకు కౌన్సిలర్ మహేశ్ ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో వినయ్, లక్ష్మణ్, కన్నయ్య, సాయి, ఏసు, అంజనేయులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా రావణాసుర వధ
మరికల్, అక్టోబర్ 16: దసరా పండుగను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దసరా కట్టదగ్గర జెండాను అవిష్కరించారు. మహబూబ్నగర్ రోడ్డు పక్కన గల శమీ వృక్షానికి నారాయణపేట జెడ్పీ వైస్చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, సర్పంచ్ కస్పే గోవర్ధన్ దంపతులు, వైస్ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీలు సుజా త, గోపాల్, వీఆర్వో పూజలు చేశారు. అనంతరం జమ్మిని పంచుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మార్కెట్ యార్డులో యువక మండలి ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన రావణాసుర వధ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రావణవధ కార్యక్రమాన్ని యువక మండ లి అధ్యక్షుడు ఆంజనేయులు నిర్వహించారు. కార్యక్రమం లో భజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ నేత లతోపాటు గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో..
కృష్ణ, అక్టోబర్ 16 : మండలంలో దసరా వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవి రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుజాల, హిందుపూర్ గ్రామాల్లో జెడ్పీటీసీ అంజనమ్మపాటిల్, ఎంపీపీ పూర్ణిమపాటిల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. వివిధ గ్రామాల్లో శమీ పూజలు నిర్వహించి ఒకరికొకరు శుభకాంక్షలు తెలుపుకొన్నారు. గ్రామ పెద్దలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్లో
మాగనూర్ అక్టోబర్ 16 : మాగనూర్ మండల కేం ద్రంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గ్రామస్తులు స ర్పంచ్ రాజు ఆధ్వర్యంలో శమీపూజ చేసి కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు జమ్మి పంచుతూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. వడ్వాట్ గ్రామంలోని ఎస్సీ వార్డులోని కనకదుర్గమ్మకు సర్పంచ్ నర్సింహులు పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఆనంద్గౌడ్ ఎంపీటీసీ సుదర్శన్గౌడ్. బసంత్రెడ్డి, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు
కోస్గిలో
కోస్గి అక్టోబర్ 16: పట్టణంలో దసరా పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక రామ్లీలా మైదానం వరకు చేరుకొని మైదానంలో శమీపూజ నిర్వహించారు. అనంతరం రావణాసుర వధ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జమ్మి పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపాల్ చైర్పర్సన్ శిరీషారాజేశ్ ఫాంహౌస్లో కోస్గి మద్దూర్ మండల కార్యకర్తలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ మధుకర్రావు, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, మార్కెట్కమిటీ చైర్మన్ వీరారెడ్డి, వైస్చైర్మన్ వరప్రాసద్ తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.