నారాయణపేట, సెప్టెంబర్ 9 : కాళోజీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని కలెక్టరేట్ కా ర్యాలయంలోని ప్రజావాణి హాల్లో గురువారం బీసీ సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాళోజీ చిత్రపటాని కి కలెక్టర్ హరిచందన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళోజీ సెప్టెంబర్ 9, 1914న కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రా మంలో జన్మించారన్నారు. ఆయన తెలుగు, కన్నడ, ఇంగ్లి షు, ఉర్దూ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారన్నారు. తెలంగాణలో అక్షర జ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో ఆయ న ఒకరన్నారు. తెలంగాణ ప్రజాకవిగా పేరుగాంచిన కాళోజీ ఓ వ్యక్తి కాదు సాహితీ శక్తిగా ప్రపంచంలో ప్రజాస్వామ్య ఆకాంక్షగా ప్రజల నోళ్లలో నిలిచి గెలిచిన నిజమైన ప్రజాకవి అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి కృష్ణమాచారి, కలెక్టరేట్ ఏవో ఖలీద్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో…
కృష్ణ, సెప్టెంబర్ 9 : ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా మండలంలోని గుడెబల్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం రాజేశ్వర్ ఆధ్వర్యంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రజాకవి తె లంగాణ ఉద్యమ కారుడిగా కాళోజీ చేసిన సే వలను గుర్తు చేశారు. కాళోజీ జయంతిని తె లంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఊట్కూర్ మండలంలో…
ఊట్కూర్, సెప్టెంబర్ 9 : కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని మండలంలోని నిడుగుర్తి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
నారాయణపేట మండలంలో…
నారాయణపేట రూరల్, సెప్టెంబర్ 9 : కాళోజీ జయంతిని పురస్కరించుకొని మండలంలోని తిర్మలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకొన్న హెచ్ఎం బీమయ్య, శేఖర్ను లయన్స్క్లబ్ ఆధ్వర్యం లో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్ల్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.