చౌటుప్పల్, అక్టోబర్ 16 : మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర, ఎక్సైజ్, క్రీడా, సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండు, మూడు వార్డులకు చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు 30 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బీజేపీ ముఖ్య కార్యకర్తలు జంపాల యాదగిరి, జంపాల యాదయ్య, జంపాల సాయి, తీగల వెంకటేశ్, జంపాల లింగస్వామి, జంపాల సత్తయ్య, శ్రీనివాస్చారికి మంత్రి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద ప్రజల పక్షపాతి అన్నారు. ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయడంతో పాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలాలు, నిరంతర విద్యుత్ అందిస్తున్నారని పేర్కొన్నారు.
దళిత బంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా గ్రామాలకు రాకుండా, ప్రజల సమస్యలు తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు కాంట్రాక్టుల కోసం ఉప ఎన్నిక తెచ్చాడన్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య, జిల్లా అధ్యక్షుడు జంపాల సత్తయ్య, క్షవర వృత్తిదారుల సంఘం ఉపాధ్యక్షుడు ప్రసాదం విష్ణు, రాజు, శివ, చంద్రకాంత్తో పాటు పలువురు యువకులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పల్లె రవికుమార్ గౌడ్, కౌన్సిలర్ స్వామిగౌడ్, టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు సతీశ్గౌడ్, రాష్ట్ర నాయకులు ప్రసాద్, బత్తిని లతా గౌడ్, అంబాల నారాయణగౌడ్, సీపీఎం నాయకులు పగిల్ల లింగారెడ్డి, బాదరాజు దశరథ పాల్గొన్నారు.