చండూరు, అక్టోబర్ 16 : ‘అమ్ముడు పోయిన రాజగోపాల్రెడ్డి పరిస్థితి నియోజకవర్గంలో అధ్వానంగా తయారైంది. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు నిలదీస్తూ తరిమికొడుతున్నరు. మునుగోడులో ముఖం చూపెట్టే పరిస్థితి లేదు’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో టీఆర్ఎస్ అభ్య ర్థి ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో గెలిపిస్తే కాంట్రాక్టులకు అమ్ముడుపోయి నేడు ప్రజల్లోకి రాలేని పరిస్థితి ఎదురైందన్నారు. మంత్రి కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని చెప్పగానే నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్వక్తం చేస్తున్నారన్నారు.
దమ్ముంటే బీజేపీ పాలి త రాష్ర్టాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలను అమలు చేయాలని మంత్రి అన్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి అబద్ధాల మంత్రి అయ్యిండని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలపై ప్రజలు అడిగితే రాజగోపాల్ గూండాలతో దాడులు చేయిస్తున్నాడన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఆయన మూడో స్థానానికి పరిమితం కావాల్సి వస్తుందన్నారు. ప్రచారంలో చండూరు మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, కౌన్సిలర్లు తోకల వెంకన్న, కోడి వెంకన్న, పట్టణ అధ్యక్షుడు భూతరాజు దశరథ, చొప్పరి నర్సింహ, సంగెపు నాగరాజు, కిరణ్, గుండెబోయిన శివ పాల్గొన్నారు.
చండూరు మూడో వార్డుకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్కు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి చేయలేక పార్టీ మారి ఉపఎన్నికకు కారణమయ్యారని విమర్శించారు.