గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి, సర్వమత సౌభ్రాతృత్వానికి కేరాఫ్ తెలంగాణ. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయీభాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఏడు దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ధర్మపరిరక్షణకు పాటు పడుతున్నారు. పండుగలకు సర్కారు తరఫున కానుకలు అందిస్తున్నారు. అర్చకులు, ఇమామ్లు, పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తున్నారు. ఏండ్ల తరబడి ఆదరణకు నోచని ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాలు కేటాయించి పూర్వ వైభవం తీసుకొచ్చారు. సర్వ మత శ్రేయోభిలాషి అయిన సీఎం కేసీఆర్తోనే దేశమంతా ధర్మం వర్ధిల్లుతుందని ధార్మికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మతం పేరుతో రాజకీయ కుట్రలు చేస్తూ మనుషుల మధ్య విద్వేషాలు రేపేందుకు కుట్రలు పన్నుతున్న పార్టీలకు కేసీఆరే అడ్డుకట్ట వేయగలరని ఘంటాపథంగా చెప్తున్నారు.
– రామగిరి, సెప్టెంబర్ 24
ఆధ్యాత్మికతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పెద్ద పీటవేస్తూ.. అన్ని మతాలను గౌరవిస్తూ.. మత సామరస్యాన్ని కాపాడుతున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని యజ్ఞ యగాదులు చేస్తూ..సంప్రదాయాలకు జీవం పోస్తున్నారు. అర్చకులు, మౌజం, మౌలానా, చర్చిపాస్టర్స్కు కూడా సమాన అవకాశం కల్పించి గౌవర వేతనాలు అందిస్తున్నారు. బ్రాహ్మణ వ్యవస్థను కాపాడుతూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న ఆయనకు పోటీపడే వ్యక్తి దేశంలోనే ఎవరూ లేరనడంలో అతిశయోక్తి లేదు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ధర్మ సంస్థాపన సాధ్యమవుతుందని ధార్మిక వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
గత పాలకుల హయాంలో ఆలన పాలన లేక శిథిలావస్థకు చేరిన ఆలయాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించగా ప్రస్తుతం పూర్వ వైభవం సంతరించుకున్నాయి. ధూప, దీప నైవేద్య పథకం కింద రాష్ట్రంలోని 3,675 దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు రూ. 6వేల వేతనం అందిస్తున్నారు. దేవాలయ అర్చకులు, ఉద్యోగులకు 010 పద్దుతో ప్రతి నెలా వేతనాలు అందిస్తున్నారు. రూ.2వేల కోట్లకుపైగా ఖర్చుచేసి నాటి యాదగిరిగుట్టను కనీవినీ రీతిలో యాదాద్రిగా తీర్చి దిద్దారు. కరోనా విపక్తర పరిస్థితుల్లో కూడా అర్చకులకు గౌవరవేతనం అందించి ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. బ్రాహ్మణులకు దేశంలోనే ఎవరూ కల్పించని విధంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు ఏర్పాటు చేసి వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. బ్రాహ్మణుల పిల్లలు విదేశీ విద్య, వ్యాపారం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. దాంతో పాటు అర్చక వెల్పేర్ బోర్డును ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని వర్గాలకు సమాన స్థానం కల్పించిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. దేశంలోని ఏ ప్రభుత్వాలూ ఇవ్వని విధంగా బ్రాహ్మణులకు ఆయన గౌవరం కల్పించారు. ఆధ్మాత్మికత విషయంలో ఆయనకు ఎవరూ సాటిరాలేరు. బ్రాహ్మణులకు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్, అర్చక వెల్పేర్ బోర్డు ఏర్పాటుతో రూ.170 కోట్లు కేటాయించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. పురాతన ఆలయాల పూర్వ వైభవానికి అధిక నిధులు కేటాయిస్తున్నారు. రూ.2వేల కోట్లతో కలియుగ వైకుంఠంగా, మరో తిరుమలతిరుపతిగా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించడమే ఇందుకు నిదర్శనం. ఆధ్యాత్మిక గురువు, బ్రాహ్మణ, రైతు బాంధవుడు, నిత్యం లోకకల్యాణాన్ని ఆకాంక్షించే దార్శనికుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశమంతా అభివృద్ధి చెందుతుంది.
– దౌలాతాబాద్ వాసుదేవ శర్మ, ధూప, దీప, నైవేద్య పథకం రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ సంస్కృతి, సంద్రాయాలకు అద్దం పట్టే బోనాలు, బతుకమ్మలను సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగలుగా గుర్తింపు కల్పించారు. బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహించి తగిన గౌరవం కల్పించారు. దాంతో పాటు రాష్ట్రంలోనే అతి పెద్ద జారతరైన సమ్మక్క సారలమ్మ, సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి లింగమంతుల జాతరకు ప్రాధాన్యం కల్పించారు.
ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చేసిన పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తక్కువ సమయంలోనే రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. అలాంటి విజన్ ఉన్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశ భవిషత్నే మార్చగలడు. గతంలో మేము ఆందోళనలు చేసినా అర్చకుల సమస్యలను ఎవకూ పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఎలాంటి ఆందోళనలూ చేయకున్నా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. తెలంగాణలో దేవాలయాల అభివృధ్ధికి రూ.1000 కోట్లు కేటాయించి కాకతీయుల చరిత్రను తిరగరాసిన గొప్ప ఆధ్యాత్మికవేత్త సీఎం కేసీఆర్. అర్చకుల రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచడంతో ఎంతో మందికి లబ్ధి చేకూరింది. అందరి ఆకలి, కష్టాలు తెలిసి.. అపర జ్ఞానమున్న కేసీఆర్ ద్వారానే దేశంలో మార్పు రావడం ఖాయం. దేశ వ్యాప్తంగా శాంతిభద్రతలు విలసిల్లుతాయి.
– వలివేటి వీరభద్ర శర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. (సూర్యాపేట టౌన్)
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది. ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో దీప, ధూప, నైవేద్య పథకం ద్వారా పూర్వ వైభవం వచ్చింది. ప్రతి దేవాలయంలో దీపారాధన జరుగుతున్నది. సీఎం కేసీఆర్ దూర దృష్టి కల్గిన నాయకుడు. అలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళ్లడం ఎంతో అవసరం. ధర్మాన్ని నమ్ముకొని ఆచరిస్తున్న కేసీఆర్ వంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి వస్తే దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక భావం పెరిగి, శాంతిభద్రతలు నెలకొంటాయి. అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుంది.
అన్నంబొట్ల ఫణికుమార్ శర్మ, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, (నేరేడుచర్ల)
ఆధ్యాత్మికతపై అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్. రాష్ట్రం సిద్ధించాలని ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నారు.. రాష్ట్రం ఏర్పాటయ్యాక మొక్కులు చెల్లించుకున్నారు. బ్రాహ్మణులన్నా, గురువులన్నా ఆయనకు అభిమానం. ఆయన పాలనలో ఆలయాలతో పాటు అర్చకులు, బ్రాహ్మణులు సుఖ సంతోషాలతో ఉన్నారు. బ్రాహ్మణులు, అర్చకులకు స్కేల్ ఇచ్చి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. నిరుపేదల బ్రాహ్మణుల కుటుంబాలకు చేయూతనిస్తున్నారు. ఆయన దేశ రాజకీయాల్లో వస్తే దేశంలోని బ్రాహ్మణులందరికీ లబ్ధి కలుగుతుంది.
-నూగూరి రామానుజాచార్యులు, పూజారి వాడపల్లి (దామరచర్ల)
సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేలా బ్రాహ్మణ పరిషత్కు రూపకల్పన చేసి, శిథిలమైన దేవాలయలకు పూర్వ వైభవం తెచ్చేరు. దూప, దీప నైవేద్య పథకం అమలుతో పేద బ్రాహ్మణుల్లో ఆత్మవిశ్వాసం నింపిన వ్యక్తి సీఎం కేసీఆర్. ఆయన ఎల్లపుడూ అభివృద్ధి వైపు పయణిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని బ్రాహ్మణులు నిత్యం ఆశీర్వచనం చేస్తున్నారు. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే మంచి జరుగుతుంది. మంచి పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే అందరికీ మేలు కలుగుతుంది. నిష్టతో ఉన్న ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలకి కోరుకుంటున్నాం.
– పెన్నా మోహనశర్మ, డీడీఎన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ (రామగిరి)
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశవ్యాప్తంగా మార్పు రావడం ఖాయం. దేశరాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పార్టీల్లో స్వార్ధం పెరిగి దేశం అభివృద్ధి చెందడం లేదు. తెలంగాణ 8 సంవత్సరాలుగా గణనీయంగా అభివృద్ధి చెందింది. అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. అలాంటి వ్యక్తం దేశ రాజకీయాల్లోకి వెళితే మొత్తం దేశమే అభివృద్ధి పథంలో పయనిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే అన్ని రాష్ర్టాల ప్రజలు కూడా కేసీఆర్ మాకూ కావాలని కోరుకుంటున్నారు.
– వైద్యుల కృష్ణమూర్తి, ధార్మిక వేత్త, (దేవరకొండ)
సీఎం కేసీఆర్ ధార్మిక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తూ లోకకల్యాణం కోసం యజ్ఞ యాగాలు చేస్తున్నారు. యాదాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక అర్చకుల వేతనాలు పెరుగడంతో పాటు వారికి సంక్షేమ పథకాలు అందుతుండడంతో మా బతుకులు బాగుపడుతున్నాయి. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచించే కేసీఆర్ లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం శుభ పరిణామం.
– కొంకపాక శివవిష్ణువర్ధన్శర్మ, అర్చకుడు(మేళ్లచెర్వు)