దేవరకొండ, అగస్టు 18 : క్రీడలతో యువత మధ్య ఐక్యత ఏర్పడుతుందని, వారిలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఫ్రీడమ్ క్రీడలు దోహద పడతాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించి ఫ్రీడమ్ కప్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐలు శ్రీనివాస్, రవీందర్, పరషురాం, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : మానసిక, శారీరక వికాసానికి క్రీడలు దోహదపడతాయని జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన మండలస్థాయి పాఠశాలల విద్యార్థుల క్రీడలను బుధవారం ఆయన ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డితో కలిసి ప్రారంభించారు. విజేతలకు ఎన్బీఆర్ ఫౌడేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, చిట్టిబాబునాయక్, వార్డు కౌన్సిలర్ రవి, క్రీడా కన్వీనర్ కోల శ్రీనివాస్, సైదులు, హెచ్ఎం నర్సిరెడ్డి పాల్గొన్నారు.
నేరేడుగొమ్ము (చందంపేట) : నేరేడుగొమ్ము ఆదర్శ పాఠశాలలో గురువారం నిర్వహించిన మండల స్థాయి పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీలను జడ్పీటీసీ కేతావత్ బాలూనాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వీహెచ్. రాజు, ఎంఈఓ సామ్యానాయక్, సర్పంచ్ బాలమణి, వైస్ ఎంపీపీ ముత్యాలమ్మారాములు, పీఏసీఎస్ చైర్మన్ ముక్కమల బాలయ్య పాల్గొన్నారు.