చేసిన పదో తరగతి వార్షిక ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. జిల్లావ్యాప్తంగా బాలికలు 95.13 శాతం, బాలురు 90.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. కొవిడ్ నేపథ్యంలో రెండేండ్లపాటు పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ పాస్ చేయగా, 2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా సూర్యాపేట జిల్లా 16వ స్థానంలో నిలిచింది. గురుకుల, కస్తూర్బా పాఠశాలల విద్యార్థులు ఫలితాల్లో హవా సాగించారు.
సూర్యాపేట అర్బన్, జూన్ 30 : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా 16వ స్థానంలో నిలిచింది. పరీక్షకు 12,443 మంది విద్యార్థులు హాజరు కాగా 11,572 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 6,347 మందిలో 5,773 మంది, బాలికలు 6,096 మందిలో 5,799 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 93 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 391 మంది 10 జీపీఏ సాధించారు. పరీక్షకు హాజరైన బాలికల్లో 95.13 శాతం, బాలురలో 90.96 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలదే పైచేయిగా నిలిచింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం తగ్గింది.
తుంగతుర్తి, జూన్ 30 : పదో తరగతి ఫలితాల్లో బాలికలు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. తుంగతుర్తిలోని బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 98.6శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ కృష్ణ తెలిపారు. పుల్లె భరత్కుమార్ 10జీపీఏ సాధించినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకులంలో 98శాతం ఉత్తీర్ణత సాధించగా శిరీష, భార్గవి 10జీపీఏ సాధించినట్లు చెప్పారు. మైనార్టీ గురుకులంలో 98.4శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ ఉమారెడ్డి తెలిపారు. గిరిజన బాలికల గురుకులంలో 90 శాతం ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపాల్ దుర్గాభవానీ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 86.46 ఉత్తీర్ణత సాధించారు. మండల వ్యాప్తంగా పది మంది 10జీపీఏ సాధించిట్లు ఎంఈఓ బోయిని లింగయ్య తెలిపారు.
చివ్వెంల : మండలంలోని గుంజలూరు, జి.తిరుమలగిరి,వట్టిఖమ్మంపహాడ్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ గోపాల్రావు తెలిపారు. ఉండ్రుగొండకు చెందిన గుడిసె ఆకాశ్ 9.8 జీపీఏ, జి.తిరుమలగిరి, బీబీగూడేనికి చెందిన ధరావత్ శ్రీలేఖ 9.8 జీపీఏ సాధించినట్లు వెల్లడించారు.
పెన్పహాడ్ : మండల వ్యాప్తంగా 341మంది విద్యార్థుల్లో 326(95.60 శాతం)మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ నకిరేకంటి రవి తెలిపారు. అనాజీపురం ఆదర్శ పాఠశాల, బీసీడబ్ల్యూ బాలికలు సింగారెడ్డిపాలెం పాఠశాల, భక్తళాపురం పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. అనాజీపురం ఆదర్శ పాఠశాలలో బి.మన్మిత 10జీపీఏ, లీనా నూరియా 9.8 జీపీఏ, బీసీడబ్ల్యూ సింగారెడ్డిపాలెం పాఠశాలలో పది మంది 10జీపీఏ, ఐదుగురు 9.8 జీపీఏ సాధించారు.
గరిడేపల్లి : మండలంలోని గడ్డిపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. పాఠశాలకు చెందిన నక్క మనోజ్, గోగుల జీవన్ 10జీపీఏ సాధించగా, జి.సాయిశివ, ఎన్.అజయ్కుమార్ 9.7 జీపీఏ సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ దండెం రవికుమార్ తెలిపారు. గరిడేపల్లి, కల్మల్చెర్వు, పొనుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించినట్లు ఎంఈఓ చత్రూనాయక్ తెలిపారు.
నేరేడుచర్ల : మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థి యరగొర్ల అఖిల్ 10జీపీఏ, ముత్తినేని జ్ఞానేశ్వరి 9.8, కీసర కల్యాణి 9.7 జీపీఏ సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్. శ్రీనివాస్ తెలిపారు.
నూతనకల్ : మద్దిరాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 88శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని వి.భవానీ 10జీపీఏ సాధించి మండల టాపర్గా నిలిచింది. గోరెంట్ల పాఠశాల విద్యార్థులు 9.5 జీపీఏ సాధించి రెండో స్థానంలో నిలిచారు. మద్దిరాల, గోరెంట్ల విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు.
తిరుమలగిరి : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 91.3 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ శాంతయ్య తెలిపారు. అనంతారం మోడల్ స్కూల్ 9.8 జీపీఏ, వెలిశాల, జలాల్పూర్ పాఠశాలల్లో 9.7 జీపీఏ సాధించినట్లు తెలిపారు.
మేళ్లచెర్వు : మండలంలో పదో తరగతి విద్యార్థులు 93.43 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ సైదానాయక్ తెలిపారు. కస్తూర్బా పాఠశాలకు చెందిన మామిడి మల్లేశ్వరి 9.7 జీపీఏ, మండల కేంద్రానికి చెందిన ఐడియల్ హైస్కూల్ విద్యార్థినులు బొడ్డు సిరి, షేక్ మస్తాన్బీ 10 జీపీఏ సాధించారు. చింతలపాలెం మండలంలో 340 మందికి 304 మంది ఉత్తీర్ణత సాధించారు.
కోదాద రూరల్/కోదాడటౌన్ : కోదాడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాయని ఎంఈఓ సలీం షరీఫ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా 622 మందికి 552 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పట్టణంలోని సాయిభవానీ జిల్లా పరిషత్ బాలికకోన్నత పాఠశాల నుంచి ఇద్దరు, గుడిబండ హైస్కూల్కు చెందిన ఒకరు 10 జీపీఏ సాధించినట్లు చెప్పారు. గుడిబండ, తొగర్రాయి, కాపుగల్లు, గణపవరం పాఠశాలలు 100శాతం ఫలితాలు సాధించినట్లు చెప్పారు. గుడిబండకు చెందిన ఎస్కే రియాజ్ 10జీపీఏ, గణపవరం పాఠశాల విద్యార్థిని పొట్ట భార్గవి, కోదాడ బాలుర పాఠశాల విద్యార్థిని భానుతేజ 9జీపీఏ సాధించారు.
కోదాడటౌన్ : పది ఫలితాల్లో ఎస్ఆర్ఎం పాఠశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందినట్లు పాఠశాల చైర్మన్ కేశినేని శ్రీదేవి తెలిపారు. 15 మంది 10 జీపీఏ, 26 మంది 9.8, 26 మంది 9.7, 26 మంది 9.5, 20 మంది 9.2 జీపీఏ సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
కోదాడటౌన్ : పట్టణంలోని శ్రీస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటినట్లు పాఠశాల కరస్పాండెంట్ వేదాంతరావు తెలిపారు. ముగ్గురు విద్యార్థులు 10 జీపీఏ, 8 మంది 9.8 జీపీఏ సాధించినట్లు చెప్పారు.
కోదాడటౌన్ : తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ఎస్వీ విద్యాసంస్థల చైర్మన్ ముత్తినేని సైదేశ్వర్రావు తెలిపారు. పట్టణంలోని పాఠశాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.
మునగాల/మోతె : మునగాల మండలంలో 324 మందికి 274 మంది(84.56 శాతం) ఉత్తీర్ణత సాధించారు. మోతె మండలంలో 215మందికి 197 మంది ఉత్తీర్ణులైనట్లు ఎంఈఓ గోపాల్రావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 9.8 జీపీఏ సాధించినట్లు చెప్పారు. కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో 36 మందికి 36 మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు.
అనంతగిరి : మండలంలో 91.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. 139 మంది విద్యార్థులకు 127 మంది ఉత్తీర్ణులయ్యారు. పాలవరం, త్రిపురవరం పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించినట్లు ఎంఈఓ సలీం షరీఫ్ తెలిపారు.
చిలుకూరు : మండలంలోని ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. గురుకుల పాఠశాలకు చెందిన పలువురు 10జీపీఏ సాధించారు.
సూర్యాపేట అర్బన్ : జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలకు చెందిన 86 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా, 65 మంది 9.8, 44 మంది 9.7, 25 మంది 9.5 జీపీఏతో మొత్తం 249 మంది 9 కంటే ఎక్కువ జీపీఏ సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. ప్రతి ముగ్గురిలో ఒకరు 10, హాజరైన ప్రతి ఇద్దరిలో ఒకరు 9.8 జీపీఏ సాధించారన్నారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థుల్లో టి.మాధురి, ఎస్.శ్రీచరణ్, టి.శివరామకృష్ణ, కె.భావన, ఎం.అక్షయ, సీహెచ్.గాయత్రీమణి, కె.వెంకటేశ్, డి.రేవతి, డి.శ్రద్ధ, ఎన్.లాస్యం, ఆర్.ఇంద్రసేనరెడ్డి, ఎస్.సాయిచరణ్రెడ్డి, డి.శివచరణ్, సుభానీ, కేవీ నిష, ఎం.హర్షిణి, వై.రామ్ చరణ్, ఎం.వివేక్తేజ్, వై.హారిక, ఎం.వేదసంహిత, ఎం.అశ్రిత, ఎన్.నితిష, జి.చందన, వి.మహేశ్, కె.కీర్తన. ఎం.అనిరుధ్, సీహెచ్.గీతిక, టి.తనుష్క, సీహెచ్.స్వర్ణశ్రీ, ఎం.ధన్య, బి.ధరణి, జి.మేఘన, కె.సరయు, కె.రిషితరెడ్డి, సీహెచ్.దినేశ్వర్, జి.శ్రీమహాలక్ష్మి, వి.హర్షిత, ఎం.శ్రీహిత, ఎన్.దీక్షిత, ఐ.జ్యోతిర్మయి, జి.వైష్ణవి, డి.సాయిరోహన్, వి.లిఖిత, ఎం.జస్మిత, వై.హరిణి, టి.తన్మయ్శ్రీ, ఎం.మోక్షిత, కె.సిద్దార్థన్, ఎస్.ప్రేమ్కుమార్, బి.సిద్దార్థ్, టి.రిత్విక్రెడ్డి, డి.లక్ష్మీప్రియాజాదవ్, కె.అభిజిత్, ఎం.సహస్ర, కె.లక్షీత్రిశాలి, ఆర్.శ్రీజ, టి.శ్రీలక్ష్మి, కె.మధులిక, జి.చక్రధర్, ఎం.విశాల్, వి.సిరిచరిత, కె.త్రివేణి, జె.గౌతమ్కుమార్, యు.వంశీ, కె.నివేద, డి.యశ్వంత్, సీహెచ్.అక్షరారెడ్డి, బి.కార్తీక్, ఎం.సుమన్, ఎన్.సాయిశ్రీరామ్, పి.సిద్దార్థ, ఇ.సాయి దిశ్విత, సమీరుద్దీన్, సమరీన్, ఎన్.సిద్దార్థ, ఎస్.వెన్నెల, ఎన్.వంశీనివాస్, అబ్దుల్మాలిక్, వనం లిఖిత, ఎస్.రిత్విక్రెడ్డి, జి.సింధు, ఎం.లాస్యశ్రీ, ఆర్.భవ్యశ్రీ ఉన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపక బృందాన్ని కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెలాల పద్మ అభినందించారు.
జిల్లా కేంద్రంలోని కాకతీయ హైస్కూల్కు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. పాఠశాలకు చెందిన ఎస్.రిషిత, సీహెచ్.అక్షయ, జి.అశ్విత, జి.మైత్రి 10జీపీఏ సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, సహకరించిన అధ్యాపకులను పాఠశాల చైర్మన్ హరినారాయణ, ప్రిన్సిపాల్ గాలి రమేశ్, అధ్యాపక బృందం అభినందించారు.
జిల్లా కేంద్రంలోని సిటీ టాలెంట్ హైస్కూల్ విద్యార్థులు విజయఢంకా మోగించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు 25 మంది ద్యూతికౌషిక్, అయేషా జబీన్, సీహెచ్శ్రీవర్షిణి, సీహెచ్.ఎన్.ఎస్.భవానీ, వి.వివేక్ ఆదిత్య, జి.భవ్యశ్రీ, జి.శృతి, కె.అనూష, కె.మనోజ్ఞ, ఎన్.దుర్గా రంజిత్, ఎన్.స్ఫూర్తి, ఎన్.విదీక్ష, ఆర్.అక్షయ, ఆర్.శ్రీసాయివర్షిత, ఎస్.భానుప్రసాద్, ఎస్.రిత్విక్రెడ్డి, ఎస్.ఎస్.ఎల్ వైష్ణవి, ఎస్కే ఏఆసియా, టి.రామ్చరణ్తేజ్, యు.రోజి, వి.ధన్విశ్రీ, వి.సాయిధీరజ్, వి.శ్రీదీప, జి.నందిని 10జీపీఏ సాధించగా, 14 మంది 9.8, 24 మంది 9.7 జీపీఏ సాధించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను, సహకరించిన సిబ్బందిని పాఠశాల కరస్పాండెంట్ ఆర్.ప్రకాశ్రెడ్డి అభినందించారు.
సూర్యాపేట అర్బన్ : పదోతరగతి పరీక్ష ఫలితాల్లో జె 9,అంజలీ పాఠశాల విద్యార్ధులు 10జిపిఏ 9 మంది విద్యార్ధులు సాధించారు.41 మంది విద్యార్ధులు పరీక్షకు హజరు కాగా 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.విద్యార్ధులను పాఠశాల యాజమాన్యం వెంపటి అజయ్ కుమార్,సుభాశ్ ప్రత్యేకంగా అభినందించారు. సూర్యాపేటలోని సృజన కాన్సెప్ట్ హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. పాఠశాలకు చెందిన 8 మంది జి.కీర్తనయాదవ్, పి.లీనామాళవిక, ఎస్.భానుశ్రీ, ఎన్.అక్షిత, సీహెచ్.రేహాన్, పి.హారికారెడ్డి, వి.శ్వేత, ఎం.కార్తీక్ 10 జీపీఏ సాధించగా, పి.హృషికేష్పిళ్లె, ఎల్.వైష్నవీదేవి, సానియా, వి.కార్తీక్ 9.8 జీపీఏ సాధించారు. 53 మంది విద్యార్థుల్లో 44 మంది 9. జీపీఏ సాధించారు. విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఎం.శ్రీనివాసరావు, ఎం.రవికుమార్ అభినందించారు.
హుజూర్నగర్ : గ్రీన్వుడ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.10 మంది 10 జీపీఏ సాధించినట్లు స్కూల్ చైర్మన్ తుమ్మ మర్రెడ్డి , డైరెక్టర్ సరిత తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కరస్పాడెంట్ కృష్ణారావు, ప్రిన్సిపాల్ రాజారెడ్డి అభినందించారు.