సూర్యాపేట రూరల్, జూన్ 23 : దళిత బంధు దేశంలోనే గొప్ప పథకంగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారుడు, సర్పంచ్ క త్తుల మల్లయ్య పట్టణ పరిధిలోని 13వ వార్డు జనగాం క్రాస్రోడ్డులో ఏర్పాటు చేసిన దళిత బంధు యూనిట్ సిమెంట్ ఐరన్ షాపును గురువారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
దళితులను అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. దళిత బంధు లబ్ధిదారులు ఆర్థిక వనరులు పెంచుకొని స్థిరపడాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, 13వ వార్డు కౌన్సిలర్ వట్టె రేణుక, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్రెడ్డి, నాయకులు ముదిరెడ్డి సంతోష్రెడ్డి, షేక్ రఫీ పాల్గొన్నారు.
పెన్పహాడ్, జూన్ 23 : ఉమ్మడి పాలనలో ఆనాటి పాలకులు రైతుల నడ్డి విరిస్తే.. తెలంగాణ రాకతో రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అందిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని అనంతారం క్రాస్ రోడ్డు వద్ద ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని, అలాగే వైనతేయ గ్రూపు సంస్థలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులు తలెత్తుకునేలా అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ఆదుకుంటున్నట్లు తెలిపారు. నాడు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి పాలకులు లబ్ధిపొందితే నేడు ఎరువులతో సహా అన్ని సౌకర్యాలు రైతుల చెంతకే తరలివస్తున్నట్లు చెప్పారు.
అందులో భాగంగానే ప్రభుత్వం గ్రామ గ్రామాన ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. పెన్పహాడ్ మండల రైతుల కోరిక మేరకు ఎక్కడో ఉన్న కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు తీసుకువచ్చి ఆదుకుంటున్నట్లు తెలిపారు. కృష్ణ, గోదావరి, మూసీ నీళ్లతో పెన్పహాడ్ మండలం త్రివేణి సంగమంగా మారిందని చెప్పారు. ఈ వానాకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కల్తీ విత్తనాల విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, సర్పంచ్ బైరెడ్డ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ మామిడి రేవతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేంధర్, వెన్న సీతారాంరెడ్డి, వావిళ్ల రమేశ్, అనిరెడ్డి వెంకట్రెడ్డి, పరెడ్డి సీతారాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తూముల భుజంగరావు, తూముల సురేశ్రావు, బీజేపీ మండలాధ్యక్షుడు పోకల రాములు, వైనతేయ నిర్వహకులు మామిడి అంజయ్య, చెన్ను సుదర్శన్రెడ్డి, సాయిరి రమేశ్, బీంపంగి ప్రవీణ్, బొడ్డు దిలీప్, చిన్న శ్రీరాములు, తాసీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీఓ వెంకటాచారి, ఏఓ కృష్ణసందీప్ పాల్గొన్నారు.