చండూరు, సెప్టెంబర్ 28 : టీఆర్ఎస్ మండల కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు మంగళవారం ప్రకటించారు. మండలాధ్యక్షుడిగా కస్తాల గ్రామానికి చెందిన బొమ్మరబోయిన వెంకన్న రెండోసారి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కురుపాటి సుదర్శన్, మాదగోని వెంకటేశం, గుండా యాదగిరిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగాఅవ్వారి శ్రీను, అధికార ప్రతినిధిగా బొడ్డు సతీశ్గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సరికొండ ముత్యాలు, కట్టా సతీశ్, సంయుక్త కార్యదర్శులుగా కాటం శ్రీను, చెనగాని వెంకన్న, చిలుకూరి అంజయ్య, ప్రచార కార్యదర్శులుగా పందుల భిక్షం, జక్కలి శ్రీను, గుండమల్ల వెంకటేశం, కోశాధికారిగా బరిగెల అశోక్, కార్యవర్గ సభ్యులుగా బొడ్డు మురళీమోహన్, బండమీది ఎల్లయ్య, పల్లె శ్రీను, కర్నాటి అబ్బయ్య, పంకెర్ల ప్రభాకర్, వెల్దండ రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు.
అనుబంధ కమిటీలు
యువజన విభాగం మండలాధ్యక్ష, కార్యదర్శులుగా ఉజ్జిని అనిల్రావు, మారెడ్డి అరవింద్రెడ్డి, పెండ్యాల గీత, ఇరిగి సునీత (మహిళావిభాగం), పగిళ్ల భిక్షం, పోలె అశోక్ (కార్మిక విభాగం), మలిగె లింగస్వామి, కంబాలపల్లి వెంకన్న (రైతు విభాగం), జక్కల రవీందర్, కామిశెట్టి ఆంజనేయులు(బీసీ సెల్), గడ్డం నర్సింహ, దాసరి కోటేశ్ (ఎస్సీ సెల్), ఎండీ.మహమూద్, ఎండీ అలీ జిన్నా (మైనార్టీ సెల్), ఆలేటి శివప్రసాద్, చెరుపల్లి ఆంజనేయులు (సోషల్మీడియా) ఎన్నికైనట్లు తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డికి కొత్త కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
మండల కమిటీ ఎన్నికపై హర్షం
మునుగోడు : టీఆర్ఎస్ మండల కమిటీ ఎన్నికపై హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని గూడపూర్లో టీఆర్ఎస్ కార్యకర్తలు పటాకులు కాల్చారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామశాఖ అధ్యక్షుడు దెందె మల్లేశ్, ఉపాధ్యక్షుడు దర్శనం వెంకన్న, నన్నూరి భూపతిరెడ్డి, కొంగళి వెంకన్న, కొంగళి విష్ణు, కొంగళి సురేశ్, దెందె వెంకన్న, గాలి లక్ష్మయ్య, దర్శనం లక్ష్మయ్య, దేశిడి వెంకన్న, సైదులు పాల్గొన్నారు.
మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడిగా అబ్దుల్ రజాక్
మర్రిగూడ : టీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడిగా తమ్మడపల్లికి చెందిన ఎండీ.అబ్దుల్ రజాక్, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడిగా శివన్నగూడేనికి చెందిన ఆకారపు శ్రీనివాస్ ఎన్నికైనట్లు పార్టీ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్యాదవ్ ప్రకటించారు.