ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి, కేతేపల్లి మండలాల్లో ఇద్దరు మరణించగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకరు దుర్మరణం చెందారు.
కేతేపల్లి, సెప్టెంబర్ 26 : మండలంలోని కొర్ల పహాడ్ గ్రామ శివారులో టోల్ప్లాజా వద్ద ఆదివారం బైక్ను లారీ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. చీకటిగూడెం గ్రామానికి చెందిన గుం పుల గురూజీ(28)బైక్పై నకిరేకల్కు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో కొర్లపహాడ్ శివారులో లారీని డ్రైవర్ రాంగ్రూట్లో మళ్లీస్తూ బైక్ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో గురూజీ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. గురూజీ భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.అనిల్రెడ్డి తెలిపారు.
విహార యాత్రకు వెళ్లి వస్తుండగా..
తిప్పర్తి : తిప్పర్తి మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. తిప్పర్తి ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని మలక్ పేటకు చెందిన అబ్దుల్ రవూఫ్ (37) స్నేహితులు మేరాజ్, యూనుస్, కారులో డ్రైవర్ సమీయుద్దీన్లతో కలిసి ప్రకాశం జిల్లా చీరాల, గుంటూరు జిల్లా విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నారు. తెల్లవారుజామున భారీ వర్షానికి దారి కనిపించకపోవడంతో తిప్పర్తి పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారందరికీ గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించగా అబ్దుల్ రవూఫ్ మరణించాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలున్నారు. రవూఫ్ బావ అబ్దుల్అబిద్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.
ఆగి ఉన్న లారీని ఢీకొని..
బీబీనగర్ : మండలంలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. బీబీనగర్ ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం. హైదరాబాద్లోని గోల్నాకకు చెందిన వజ్రోజు బాలరాజు (43)భార్య, కూతురితో కలిసి అత్తగారిల్లు వరంగల్ జిల్లా బచ్చన్నపేటకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. గూడూరు టోల్ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స నిమి త్తం వారిని హైదరాబాద్లోని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో బాలరాజు మృతి చెం దాడు. భార్య, కూతురుకు చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు.