భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 24: సైక్లింగ్తో శారీరక దృఢత్వం, పర్యావరణ హితం చేకూరుతుందని కలెక్టర్ పమేతాసత్పతి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సైక్లింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. సైక్లింగ్తో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని, తల్లిదండ్రులు పర్యాటక ప్రాంతాలను చూపించడంతో పాటుగా సైక్లింగ్ వంటి భౌతిక క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్తివారీ మాట్లాడుతూ యువకులతో పాటు 60-70సంవత్సరాలు పైబడిన వారూ సైక్లింగ్ పోటీల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని తద్వారా ఆర్థికంగా ఎదుగడానికి దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ, యువజన సంక్షేమ శాఖల అధికారి ధనుంజయ జిల్లా అధికారులు బాలాజీ, అంజయ్య, వినోద్, జయశ్రీ, కృష్ణారెడ్డి, ప్రశాంత్రెడ్డి, శాంతి ట్రాక్ క్లబ్ సభ్యులు గోనూరు శ్రీనివాస్, బి.పాండురంగం, అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు కోనేటి గోపాల్, పీఈటీలు, రాక్ైక్లెంబింగ్ కోచ్లు, చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.