ఆత్మకూరు(ఎం), సెప్టెంబర్19 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశీలించారు. కలుపు మొక్కలు, చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచి పూల మొక్కలు నాటాలని వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని పల్లెర్లలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను మండల ప్రత్యేకాధికారి శ్యామ్సుందర్, ఎంపీడీఓ రాములు పరిశీలించారు. వారి వెంట మండల వైద్యాధికారి ప్రణీష, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
వ్యాక్సిన్పై ప్రజలను చైతన్య పర్చాలి
మోత్కూరు : కొవిడ్ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకునేలా ప్రజలను చైతన్య పర్చాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ, బుజిలాపురం పీహెచ్సీ సబ్సెంటర్లో కొవిడ్ వ్యాక్సినేషన్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లోని ఆశ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో 18 ఏండ్లు పైబడిన వారందరూ టీకా వేయించుకునేలా చూడాలన్నారు. మోత్కూరు మినీట్యాంక్ బండ్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించాలని సూచిం చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ కె.కిశోర్కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వ్యాక్సినేషన్ సెంటర్లో టీకా వేయించుకున్న వారికి మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్ మొక్కలు అందజేశారు. మోత్కూరు పీహెచ్సీ, బుజిలాపురం, కొండగడప, పాటిమట్ల, సదర్శాపురం, మో త్కూరు పట్టణంలోని కొత్తగూడెం, పాలడుగు గ్రామాల్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో ఆదివారం 347 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి డాక్టర్ చైతన్యకుమార్ తెలిపారు.