నందికొండ, సెప్టెంబర్ 17 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వరద పొటెత్తుతున్నది. దీంతో శుక్రవారం ఈ సీజన్లో రెండోసారి డ్యాం క్రస్ట్ట్గేట్లు తెరుచుకున్నాయి. 12 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,79,676 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత నెల కృష్ణానదికి భారీగా వరద రావడంతో దాదాపు 85 టీఎంసీల నీటిని క్రస్ట్ట్గేట్లు ద్వారా దిగువకు విడుదల చేశారు. కృష్ణా పరివాహక ప్రాజెకులన్నీ పూర్తిస్థాయిలో నిండడంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువన నాగార్జునసాగర్కు వదులుతున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్ధ్యం 590 అడుగులు (312.4050 టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 589.80 అడుగులు (311.44 74టీఎంసీలు)గా ఉంది. రిజర్వాయర్కు ఎగువ నుంచి 2,31,606 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో అవుట్ఫ్లో కొనసాగిస్తున్నారు. రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వకు 8367 క్యూసెక్కులు, కుడి కాల్వకు 8680, ఎస్ఎల్బీసీ ద్వారా 1800, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32683, వరద కాల్వకు 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శాలిగౌరారం ప్రాజెక్టు నీటిమట్టం @ 20 అడుగులు
శాలిగౌరారం : శాలిగౌరారం ప్రాజెక్టు నీటిమట్టం 20అడుగులకు చేరింది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు రామన్నపేట మండలం పల్లివాడ హెడ్వర్క్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని శాలిగౌరారం ప్రాజెక్టులోకి రాచకాల్వ ద్వారా నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టుపూర్తిస్థాయి నీటిమట్టం 21అడుగులు. ప్రస్తుతం వానకాలం సాగుకు నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద 6వేల ఎకరాల భూమి సాగవుతున్నది.
మూసీకి 729 క్యూసెక్కుల ఇన్ఫ్లో..
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 729.96 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల లేదు. కుడి, ఎడమ కాలువలకు 283.31క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 642.20 అడుగులు (3.74 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ ఉదయ్ తెలిపారు.