నాగారం : 18 ఏండ్లు నిండిన వారంతా కొవిడ్ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. గురువారం మండలంలోని వర్ధమానుకోట, ఈటూరు గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. కొవిడ్ నియంత్రణకు అర్హులంతా టీకా వేసుకోవాని కోరారు. వారి వెంట జడ్పీ సీఈఓ, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శిరీష, ఎంపీపీ కూరం మణీవెంకన్న, వైస్ ఎంపీపీ మణిమాల, ఎంపీడీఓ గాలి శోభారాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ హర్షవర్దన్, వైద్యులు మురళీకృష్ణ, ప్రశాంత్, సుదర్శన్, ఏఎన్ఎం కళమ్మ, ఎల్లమ్మ, పీహెచ్ఎన్ ధనమ్మ, సర్పంచులు బోయిని శోభాలింగమల్లు, పేరాల సరితాయాదగిరి, ఎంపీటీసీ వడ్డె పరుశురాములు, ఈరేటి స్వప్న అంజయ్య, మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, గుండగాని అంబయ్య పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి.. : చైర్ పర్సన్ అన్నపూర్ణ
బొడ్రాయిబజార్ : కరోనాతో అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ సూచించారు. జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. 22, 39వ వార్డుల్లో వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. 45వ వార్డులో కౌన్సిలర్ గండూరి పావనీకృపాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కమిషనర్ రామానుజుల రెడ్డి, కౌన్సిలర్లు మొరిశెట్టి సుధారాణి శ్రీనివాస్, నూకల వెంకటరెడ్డి, పిశిక వీరయ్య, కుక్కడపు సాలయ్య, వార్డు అధికారి ఉపేంద్రచారి పాల్గొన్నారు.
మాచనపల్లిలో 8 మందికి వ్యాక్సిన్
నూతనకల్ : మండలంలోని మాచనపల్లిలో కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం ఏర్పాటు చేశారు. 48 మందికి టీకాలు వేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉమా లింగమ్మ పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : మండలంలోని కాసరబాద, కేసారం గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం ఏర్పాటు చేశారు. టీకాల పంపిణీ తీరు ఎంపీడీఓ శ్రీనివాస్రావు పరిశీలించారు.
అర్హులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలి
మేళ్లచెర్వు : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్రావు సూచించారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో వ్యాక్సినేషన్ తీరును ఆమె పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఇసాక్హుస్సేన్, ఎంఈఓ సైదానాయక్, సర్పంచ్ శంకర్రెడ్డి, సీహెచ్ఓ కృష్ణయ్య, ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
మఠంపల్లి మండలంలో..
మఠంపల్లి, సెప్టెంబర్ 16 : మండలంలోని పలు గ్రామాల్లో వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసింది. ఆయాచోట్ల గ్రామస్తులకు ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్లు వేశారు. మండల వైద్యాధికారి ఫిరోజ్, ఎంపీడీఓ జానకిరాములు, ఎంపీఓ ఆంజనేయులు, సర్పంచులు కోలాహలం లక్ష్మీనరసింహరాజు, రామారావు పాల్గొన్నారు.
నేరేడుచర్లలో..
నేరేడుచర్ల : పట్టణంలో కొవిడ్ వ్యాక్సిన్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా మలేరియా నియంత్రణ అధికారి సాహితీ, మున్సిపల్ చైర్మన్ జయబాబు శిబిరాన్ని ప్రారంభించారు. వైస్ చైర్మన్ శ్రీలత, మండల వైద్యాధికారి నాగయ్య, కమిషనర్ గోపయ్య, కౌన్సిలర్ సరిత, వైద్యారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
గుడిబండలో..
కోదాడ రూరల్ : మండలంలోని గుడిబండ గ్రామంలో కాపుగల్లు పీహెచ్సీ సిబ్బంది గ్రామస్తులకు కొవిడ్ టీకాలు వేశారు. వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఎంపీపీ చింతా కవితారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ అలివేలుమంగమ్మ, ఎంపీడీఓ విజయశ్రీ, వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
గుడుగుంట్లపాలెంలో..
పాలకవీడు : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సర్పంచులఫోరం మండలాధ్యక్షుడు కిష్టపాటి అంజిరెడ్డి సూచించారు. గురువారం మండలంలోని గుడుగుంట్లపాలెంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో నేరేడుచర్ల పీహెచ్సీ సూపరింటెండెంట్ శ్యాంసుందర్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గరిడేపల్లిలో..
గరిడేపల్లి : మండలంలోని పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది కొవిడ్ వాక్సినేషన్ శిబిరాలను ఏర్పాటు చేశారు. రేగులగడ్డ తండాలో శిబిరాన్ని ఎంపీపీ పెండెం సుజాత పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ వనజ, ఎంపీఓ లావణ్య, రేగులగడ్డ తండా సర్పంచ్ ఉషా వెంకటేశ్వర్లు, వైద్యాధికారి రమ్య, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
నడిగూడెంలో.. మండల కేంద్రంతోపాటు శ్రీరంగాపురం, వల్లాపురం, రామాపురం గ్రామాల్లో వ్యాక్సినేషన్ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆయా చోట్ల జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, ఎంపీడీఓ ఎర్రయ్య వ్యాక్సిన్ పంపిణీ తీరును పరిశీలించారు. డాక్టర్ లక్ష్మీప్రసన్న, ఏఎన్ఎం రాధా, ఆశా కార్యకర్తలు శ్రీలక్ష్మీ, సైదమ్మ, సునీత, ప్రవీణ్ పాల్గొన్నారు.
ఒకే రోజు 47,520 మందికి టీకా
సూర్యాపేట టౌన్ : ఇంటింటికీ కొవిడ్ వ్యాక్సిన్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 18,042 మందికి టీకాలు వేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం తెలిపారు. అందులో మొదటి డోస్ 14,387 మందికి, రెండో డోస్ 3,655 మందికి వ్యాక్సిన్ అందించామన్నారు. దీంతో నేటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం మొదటి డోస్ 3,05,294, రెండో డోస్ 1,09710 మందితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 4,15,004 మందికి వ్యాక్సిన్ అందించినట్లు ఆయన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 11,682 మందికి, నల్లగొండ జిల్లాలో 256 సబ్ సెంటర్లలో పరిధిలో 17,796 మందికి టీకాలు వేశారు.