మిర్యాలగూడ రూరల్, సెప్టెంబర్ 15 : రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నా రు. బుధవారం అవంతీపురం వ్యవసాయ మా ర్కెట్ ఆవరణలో ఆలగడప, సుబ్బరెడ్డిగూడెం, జాలుబాయితండా, రాయినిపాలెం, అవంతీపురం, చిన్నక్యాంపు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని ఆలగడపలో ప్రభుత్వం తలపెట్టిన పారిశ్రామిక పార్కు వల్ల ఏ ఒక్క రైతుకు నష్టం కలుగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రమిక పార్కు ఒక్క ఆలగడప గ్రామంలోనే కాదని, దామరచర్ల మండలంలో పలు గ్రామాల్లో పరిశ్రమ ఏర్పాటుకు పరిశీలన జరిగిందని అన్నారు. ఆలగడప గ్రామంలో 421.35 ఎకరాలు కూడా చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని, పరిశ్రమ ఏర్పడితే వారంతా రోడ్డున పడే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి దామరచర్ల మండలంలో ఏర్పాటు చేసేలా కృషి చేస్తానన్నారు. సమావేశంలో జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.