కొవిడ్, ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి
డీఐజీ, నల్లగొండ ఎస్పీ రంగనాథ్
హాలియా/నల్లగొండ సిటీ, ఏప్రిల్ 9 : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అనుమతి లేకుండా ప్రచార వాహనాలను వినియోగిస్తే సీజ్ చేస్తామని డీఐజీ, నల్లగొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. శుక్రవారం హాలియాలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వినియోగించే వాహనాల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదని, ప్రచారానికి వినియోగించే వాహనాలకు విధిగా రిటర్నింగ్ అధికారి ద్వారా అనుమతి పొంది ఉండాలని సూచించారు. ప్రచారంలో పాల్గొనే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని, కాన్వాయిలో భద్రతా సిబ్బంది వాహనాలు కాకుండా ఐదు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, వాటి మధ్య 100 మీటర్ల దూరం పాటించాలని తెలిపారు. ఒకే సందర్భంలో ఇద్దరు అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటే కనీసం 30 నిమిషాల వ్యవధి ఉండేలా చూసుకోవాలని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
హోంలోన్ భారం వేగంగా క్లియర్ కావాలంటే..!
కీసరలో 136 కమ్యూనిటీ సీసీ కెమెరాలు ప్రారంభం